జియో సైంటిస్ట్‌ల కోసం రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌ కోర్సు

హైదరాబాద్ లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (జిఎస్ఐటిఐ) జియో సైంటిస్ట్‌ల కోసం రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌ పై నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ కోర్సును  డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు హెడ్ మిషన్-V సి.హెచ్. వెంకటేశ్వరరావు,  అధ్యక్షతన  ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో డాక్టర్ మాథ్యూ జోసెఫ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, యస్పి భూటియా, డైరెక్టర్ (టెక్నికల్ కోఆర్డినేషన్), డాక్టర్ నిషా రాణి, డైరెక్టర్ (కోర్సు కోఆర్డినేటర్), అధ్యాపకులు, వివిధ దేశాల నుండి వచ్చినా ప్రముఖులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  స్పాన్సర్ చేసిన  ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ కార్యక్రమం క్రింద ఈ శిక్షణా కోర్సు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.

 అభివృద్ధి చెందుతున్న దేశాలలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే వృత్తిపరమైన నైపుణ్యాన్ని సృష్టించడానికి సాంకేతికతను పంచుకోవడం ప్రోగ్రామ్ ముఖ్యమైన లక్ష్యం. 15 ఐటీఈసీ దేశాలు (అల్జీరియా, బంగ్లాదేశ్, డొమినికన్ రిపబ్లిక్, ఇథియోపియా, గయానా, కెన్యా, మలావి, మారిషస్, మయన్మార్, నేపాల్, నికరాగ్వా, శ్రీలంక, సూడాన్, టాంజానియా, టోగో) నుండి 15 మంది నెల రోజులపాటు జరిగే కొరుకు హాజరవుతున్నారు.

భూవిజ్ఞాన శాస్త్రం, గనుల, పర్యావరణ, పట్టణ ప్రణాళిక మొదలైనవాటిలో ఉపయోగపడే అధునాతన టెక్నాలజీలో అత్యాధునిక సాంకేతికతను నేర్చుకునేందుకు శిక్షణలో పాల్గొనే అవకాశం ఉందని వెంకటేశ్వరరావు తెలిపారు. వివిధ దేశాల నుండి పాల్గొనేవారి జ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ శిక్షణ సహాయపడుతుంది. జ్ఞానంతో సహా భారతీయ సంస్కృతి ,నాగరికత గురించి తెలుసుకునే అవకాశం వారికి లభిస్తుందని చెప్పారు. ఈ కోర్సులో పాల్గొనేవారికి రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అందించడం ద్వారా ఈ పద్ధతులను వారి సంబంధిత రంగంలో సమర్థవంతంగా వర్తింపజేయవచ్చు. దీని ద్వారా, భారతదేశం తన సామాజిక ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక విజయాల ఫలాలను ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడం జరుగుతుంది.