సూపర్స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్బులెటెన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా కాంటినెంటల్ ఆసుపత్రి ఛైర్మన్ డా.గురు.ఎన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. స్పృహలేని పరిస్థితిలోనే ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారు. దాదాపు 20 నిమిషాలపాటు సీపీఆర్ చేసి గుండెపోటు నుంచి బయటపడేలా చేశాం’ అని తెలిపారు.
`ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై చికిత్సనందిస్తున్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, శరీరం సహకరించేదాన్ని బట్టి వైద్యం అందిస్తామని వైద్యులు చెబుతున్నారు. 48 గంటల వరకు ఏమవుతుందో చెప్పలేము. ఇప్పటి నుంచి ప్రతి గంట కూడా కీలకమే’ అని కాంటినెంటల్ వైద్యులు వెల్లడించారు.
మళ్లీ 24 గంటల తర్వాత ఆయన హెల్త్ గురించి బులెటెన్ను విడుదల చేస్తామనిని చెప్పారు. కృష్ణ కుటుంబ సభ్యులందరూ ఆసుపత్రిలోనే ఉన్నారని వైద్యులు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో మహేష్ బాబు భార్య నమ్రత, కృష్ణను గచ్చిబౌలీలోని కాంటినెంటల్ హస్సిటల్లో చేర్చారు అని కాంటినెంటల్ వైద్యులు మీడియాకు తెలిపారు.
ఘట్టమనేని కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2019లో కృష్ణ భార్య విజయ నిర్మల కన్నుమూసింది. ఆ తర్వాత కరోనా సమయంలో కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న రమేష్ బాబు కన్నుమూశాడు. ఇక ఇటీవలే కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి అనారోగ్య సమస్యలతో మరణించింది. ఇలా కృష్ణ ఇంట్లో వరుసగా విషాదాలు జరుగుతుండటంతో ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు.
More Stories
కొండా సురేఖకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక
తెలంగాణాలో రాగల ఐదు రోజులు వడగాలులు
తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి