సుపరిపాలన, మెరుగైన సేవలు అందించే వాహనంగా బ్యాంకింగ్ రంగం

ఆర్థిక చేరిక, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు భారత దేశపు పురోగతిని ప్రస్తావిస్తూ దేశంలో సుపరిపాలన, మెరుగైన సేవలను అందించడానికి బ్యాంకింగ్ రంగం ఒక వాహనంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.  ఆర్థిక చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో, ప్రధాని మోదీ ఆదివారం 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డిబియు) జాతికి అంకితం చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కూడా వర్చువల్ మోడ్ ద్వారా ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు మరింత ఆర్థిక చేరికతో పాటు పౌరులకు బ్యాంకింగ్ అనుభవాన్ని గణనీయంగా మెరుగు పరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 
డిబియులు సామాన్యుల జీవితాన్ని సరళీకృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయని చెబుతూ ఇవి  అనేది కనీస డిజిటల్ మౌలిక సదుపాయాలతో గరిష్ట సేవలను అందించే వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు.

“సామాన్యుల జీవితాలను సులభతరం చేయడానికి కొనసాగుతున్న ప్రచారంలో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ముఖ్యమైనవి. ఇది కనీస డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా గరిష్ట సేవలను అందించే ప్రత్యేక బ్యాంకింగ్ సదుపాయం. ఈ సేవలు కాగితపు పని, ఇతర అవాంతరాలు లేకుండా ఉంటాయి. వీటిలో సౌకర్యాలు ఉంటాయి. అలాగే బలమైన డిజిటల్ బ్యాంకింగ్ భద్రత” అని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఏకకాలంలో రెండు అంశాల్లో పని చేసిందని చెబుతూ  ముందుగా బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరచడం, బలోపేతం చేయడం, పారదర్శకత తీసుకురావడం  చేయగా రెండవది, ఆర్థిక చేరిక అని తెలిపారు.  బ్యాంకింగ్ నేడు ఆర్థిక లావాదేవీలను అధిగమించిందని, సుపరిపాలన, మెరుగైన సేవా బట్వాడా మాధ్యమానికి ఉదాహరణగా స్థిరపడిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 

 
నేడు ఈ వ్యవస్థ ఎంఎస్ఎంఇలు, ప్రైవేట్ సంస్థల వృద్ధికి ఇంజిన్‌గా మారిందని చెప్పారు.  “బ్యాంకింగ్ రంగం సుపరిపాలన, మెరుగైన సేవలను అందించే మాధ్యమంగా మారింది. జెఎఎం ట్రినిటీ (జన్ ధన్, ఆధార్, మొబైల్) అవినీతిని అరికట్టడంలో గణనీయంగా సహాయపడింది. యుపిఇ భారతదేశానికి కొత్త అవకాశాలను తెరిచింది” అని ప్రధాని వివరించారు.

బ్యాంకింగ్ సేవ‌లు చివ‌రి మైలుకు చేరేలా చూడ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  బ్యాంకులే పేదల దరిదాపుల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామని, ఇందుకోసం ముందుగా పేదలకు, బ్యాంకులకు మధ్య దూరాన్ని తగ్గించాలని, భౌతిక దూరంతో పాటు మానసిక దూరాన్ని కూడా తగ్గించామని ఆయన పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు బ్యాంకులను తీసుకెళ్లడానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

“నేడు, భారతదేశంలోని 99 శాతానికి పైగా గ్రామాలలో 5 కి.మీ.లోపు బ్యాంకు శాఖ, బ్యాంకింగ్ అవుట్‌లెట్ లేదా బ్యాంకింగ్ మిత్ర ఉన్నాయి. నేడు, దేశంలో ప్రతి లక్ష మంది వయోజన జనాభాకు బ్యాంకు శాఖల సంఖ్య జర్మనీ, చైనా, దక్షిణాఫ్రికా వంటి దేశాల కంటే ఎక్కువ,” అని ప్రధాన మంత్రి తెలిపారు.

భారతదేశ డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రశంసించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.  “భారతదేశంలోని పేదలు, రైతులు, కార్మికులకు ధైర్యసాహసాలతో కొత్త పద్ధతులను అంగీకరించి, దానిని తమ జీవితంలో ఒక భాగం చేసుకున్న వారికి ఈ ఘనత దక్కుతుంది. ఆర్థిక భాగస్వామ్యం డిజిటల్ భాగస్వామ్యానికి అనుసంధానం అయినప్పుడు, అవకాశాలకు కొత్త ప్రపంచం తెరుచుకుంటుంది” అని ఆయన తెలిపారు.

‘ఫోన్ బ్యాంకింగ్’ స్థానంలో ‘డిజిటల్ బ్యాంకింగ్’తో భారతదేశం స్థిరమైన వృద్ధిని సాధించిందని ప్రధాన మంత్రి చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని 75 జిల్లాల్లో 75 డీబీయూలను ఏర్పాటు చేశారు.  ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం, డిబియులు ఇటుక, మోర్టార్ అవుట్‌లెట్‌లుగా ఉంటాయి. 

 
ఇవి ప్రజలకు పొదుపు ఖాతాలు తెరవడం, బ్యాలెన్స్-చెక్, ముద్రణ పాస్‌బుక్‌లు, నిధుల బదిలీ, పెట్టుబడి వంటి అనేక రకాల డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలను అందిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణ దరఖాస్తులు, జారీ చేసిన చెక్కుల కోసం స్టాప్-పేమెంట్ సూచనలు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తులు, పన్ను, బిల్లు చెల్లింపు, నామినేషన్లు వంటి సేవలు అందిస్తాయి.

డిబియులు ఏడాది పొడవునా బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవల  తక్కువ ఖర్చుతో కూడిన, అనుకూలమైన యాక్సెస్, మెరుగైన డిజిటల్ అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పిస్తాయని పిఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.