పంజాబ్లోని అమృతసర్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్)కు చెందిన దళాలు శుక్రవారం పాకిస్థాన్ డ్రోన్ను కూల్చివేశాయి. పాక్ భూభాగం నుంచి భారత సరిహద్దులోకి ప్రవేశించడంతో డ్రోన్ను కూల్చేశామని బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
శుక్రవారం ఉదయం సమయంలో పాకం వైపు నుంచి డ్రోన్ను గుర్తించిన షాపూర్ బోర్డర్ ఔట్పోస్టులోని బిఎస్ఎఫ్ సిబ్బంది 17 రౌండ్లు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. అస్పష్టంగా ఉన్న డ్రోన్ భారత సరిహద్దులోకి ప్రవేశించగానే బాంబులుతో దాన్ని కూల్చివేశామని, డ్రోన్ గిల్ గ్రామంలో కూలిపోయిందని అధికారులు వివరించారు.
అనంతరం నాలుగు కిలోల బరువున్న డ్రోన్ శిథిలాలను స్వాధీనం చేసుకున్నారు. నైలాన్ తాడు, రిఫ్లెక్టర్ లైట్లు, గ్రీన్ పట్టీని కనుగొన్నామని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. డైరెక్టర్ జనరల్ సింగ్ మాట్లాడుతూ పంజాబ్లోని కిలోమీటర్ల మేర పాకిస్థాన్ సరిహద్దు వెంబడి తమ దళాలు పహారా కాస్తున్నాయని చెప్పారు.
More Stories
బెంగళూరు, శివమొగ్గలలో ఎన్ఐఎ దాడులు
బిజాపూర్ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి
ఆప్ నిరసనలతో ఢిల్లీలో మూడు మెట్రో స్టేషన్ల మూసివేత