విశ్వహిందూ పరిషత్ నేత బాలస్వామికి బెదిరింపు కాల్స్

బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమాలను నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటు సౌత్ జోన్ డిసిపి అదనపు డీసీపీ లపై డిమాండ్ చేయడానికి సవాల్ చేస్తున్నారు. 
 
రకరకాల పేర్లతో కాల్స్ ఏసి భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించి తలపెట్టిన నిరసన కార్యక్రమాలు వెంటనే రద్దు చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 
 
అయితే వాస్తవంగా విశ్వహిందూ పరిషత్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ను మార్పిడి చేసి వైరల్ చేశారు. కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు జోడించి జనాల్లోకి వదిలారు. దీనిపై బాలస్వామి స్పందిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళన
వాస్తవానికి బాలస్వామి విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో జరుగుతున్న హిందూ వ్యతిరేక శక్తులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.  పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే గాక, పోలీసులే ముస్లింలను రెచ్చగొట్టి హిందువుల పైకి ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. 
 
 ప్రశాంతమైన భాగ్యనగరాన్ని అల్లర్లతో అట్టుడికించే కుట్ర సాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ పూర్తిగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనగా బజరంగ్ దళ్, వి హెచ్ పి ఆందోళనకు సిద్ధమైందని తెలిపారు. 
 
సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు ఇచ్చారు. పాత నగరంలో దాదాపు 100 మంది నేరస్తులను పోలీస్ స్టేషన్ ల నుంచి తీసుకువెళ్లిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై వెంటనే చర్యలు చేపట్టాలని బాలస్వామి. డిమాండ్ చేశారు  అల్లర్లకు పాల్పడిన యువకులపై చట్ట రీత్యా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. 
 
“ముస్లింలు అమాయకులు.. హిందువులే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు” అని ముస్లింలను రెచ్చగొట్టిన సౌత్ జోన్ డీసీపీ,   అదనపు డిసిపిలను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోషామహల్ ప్రాంతాన్ని తగలబెడతామన్న రషీద్ ఖాన్,  కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ లను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. 
 
వినాయక నవరాత్రుల ముందు హిందూ ద్రోహి మునావర్ షోకు అనుమతించి, భాగ్యనగర్ లో చిచ్చుపెట్టిన కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బాలస్వామి డిమాండ్ చేశారు. ఇదే విషయాలపై తాము నాలుగు రోజుల క్రితం డిజిపి గారిని కలిసి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం హిందూ వ్యతిరేక చర్యల్లో భాగంగానే  భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. 
 
కాబట్టి హిందూ సమాజమంతా ఒక్కటిగా నిలిచి,హిందూ వ్యతిరేక ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బజరంగ్ దళ్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పిలుపిచ్చారు. కార్యకర్తలంతా పాల్గొని హిందూ శక్తిని చాటాలని పేర్కొన్నారు.ఇది పార్టీలకు అతీతంగా జరిగే నిరసన కార్యక్రమం అంటూ ఇందులో ప్రతి హిందు పాల్గొనాలని కోరారు.