కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ బృందానికి అనుమతివ్వమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ వ్రాసారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో బీజేపీ పార్టీ కి చెందిన ఎం.పి.లు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ నిపుణులు మొత్తం 30 మంది ముఖ్యమైన బీజేపీ నాయకులు ఉంటారని ఆ లేఖలో తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టును సెప్టెంబర్ మొదటి వారంలో బీజేపీ బృందం సందర్శిస్తుందని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నామని ఆ లేఖలో తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.
భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మోటార్లకు ఏర్పడిన నష్ణాన్నిపరిశీలించడానికి బీజేపీ బృందం పర్యటన లక్ష్యం అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. 1998 వరదలతో శ్రీశైలం టర్బైన్స్ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శంచాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
2004 – 2009 లో జరిగిన జలయజ్ఞం పనులపై వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని కూడా గుర్తు చేశారు. ప్రభుత్వం వైపు నుండి కూడా ఇరిగేషన్ అధికారులను పంపి తమ సందేహాలను నివృత్తి చేయమని ఆయన కోరారు
More Stories
బిజెపి ఎమ్యెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి
పత్తాలేని బిఆర్ఎస్…కాంగ్రెస్కు ఓటమి ఖాయం
మేడిగడ్డను పరిశీలించిన జస్టిస్ ఘోష్