అల్లర్లు సృష్టించేందుకే మునావర్ షో కు అనుమతి 

భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసి, అల్లర్లు సృష్టించేందుకే తెలంగాణ ప్రభుత్వం మునావర్ షో కు అనుమతించిందని విశ్వహిందూ పరిషత్, హిందూవాహిని, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  రాజకీయ లబ్ధి కోసం హిందూ వ్యతిరేక చర్యలకు పూనుకోవడం క్షమించరాని దుశ్చర్య అని వారు గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ కు  సమర్పించిన వినతిపత్రంలో స్పష్టం చేశారు. 
రాజ్ భవన్ లో సురేందర్ రెడ్డి, డా. భగవంతరావు, రామరాజు, పండరినాథ్, పగుడాకుల బాలస్వామి, శివరాములు, కరోడిమల్, ఉప్పల రాజు గవర్నర్ ను కలసి  ప్రశాంతమైన భాగ్యనగరంలో చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పవిత్రమైన వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంలో మునావర్ షో కు అనుమతించ వలసిన అవసరం ఏమిటని వారు ప్రశ్నించారు.
దేశంలోని 16 రాష్ట్రాలలో మునావర్ షోలను నిషేధించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయనను ఘనంగా ఎందుకు ఆహ్వానం పలికింది? అని ప్రశ్నించారు. ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి తరహాలో భద్రత కల్పించి హిందువులను తిట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది?అంటూ నిలదీశారు. హిందూ దేవి దేవతలను అవమానపరిచే కామెడీ షో కోసం భాగ్యనగరం లోని హిందూ సంస్థలను బందీలను చేయడం అవసరమా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
అధికార దాహం కోసమే తెలంగాణ సర్కార్ ఈ చిచ్చు పెట్టిందని వారు ఆరోపించారు. హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తూ హిందుత్వంపై విషం చిమ్మే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమైందని విమర్శించారు.  తెరాస తమ మిత్రపక్షమైన మజిలీస్ పార్టీకి హిందువులపై దాడులు చేసే స్వేచ్ఛను అప్పగించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
 మునావర్ ఫరూక్ అనే హిందూ ద్రోహిని ప్రోత్సహిస్తూ ఇటివల అతడి కామెడీ షోకు పోలీసులు అనుమతి ఇచ్చి హిందువులను రెచ్చగొట్టారని వారు స్పష్టం చేశారు. వేలాదిగా పోలీసులు గుమిగూడి నిర్వహించిన ఈ కామెడీ షో తో హిందువుల పైకి ముస్లింలను రెచ్చగొట్టినట్టు చేశారని తెలిపారు.
టిఆర్ఎస్ నేతలు. మనవార్ వస్తున్నాడు అంటే హిందూ సంస్థల నాయకులు అందరిని ముఖ్యంగా విశ్వహిందూ పరిషత్ , బజరంగ్దళ్ కార్యకర్తలను ఉదయాన్నే హౌస్ అరెస్టు చేశారని తెలిపారు. మరికొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లకు తీసుకెల్లారని చెబుతూ ఇది ఒక భాగ్యనగరంలోనే కాకుండా రాష్ట్ర మొత్తం ఇదే పరిస్థితిని పోలీసులు నెలకొల్పారని వారు గవర్నర్ కు తెలిపారు.
అయితే మునావర్ ను రాష్ట్రానికి రానివ్వద్దని.. వస్తే అడ్డుకొని తీరుతామని హిందూ సంస్థలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వారు చెప్పారు. పైగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వేలాది పోలీసులను మోహరించి షో నిర్వహించి,  పచ్చటి మహానగరంలో నేడు చిచ్చు పెట్టి చలికాచుకుంటుందని విమర్శించారు.
 
హిందూ దేవీ దేవతలను కావాలని అవమానపరిచిన మునావర్ ను నగరానికి అనుమతించవద్దంటూ జరిగిన నిరసన కార్యక్రమాలు.. తదనంతరం జరిగిన పరిణామాల కారణంగా భాగ్యనగరంలో ముస్లిం మూకలు రెచ్చిపోయి, హిందువులపై విరుచుకుపడ్డాయని వారు తెలిపారు. 
 
పాత నగరంలో చాలా ప్రాంతాలలో ముస్లిం దుండగులు స్వైర విహారం చేశారని, పలుచోట్ల హిందువుల ఇల్లు, దుకాణాలపై రాళ్ల వర్షం కురిపించారని వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో హిందువుల ఇల్లకు నిప్పు పెట్టారని అంటూ  ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని తగలబెట్టారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. 
 
 చార్మినార్, శాలిబండ, చత్రినఖ, ఉప్పరపల్లి తదితర ప్రాంతాల్లో ముస్లింలు యదేచ్చగా మారణాయుధాలతో రోడ్లపై ర్యాలీ నిర్వహించారని, హిందుత్వానికి, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని,  భయభ్రాంతులు సృష్టించారని వివరించారు. అయినా కూడా పోలీసులు, ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. 
 
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ముస్లిం అల్లరి మూకలు చేసిన వికృత విన్యాసాలను పోలీసులు కల్లప్పగించి చూశారు తప్ప వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు. ఇంతటి భయానక పరిస్థితుల్లో హిందూవు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ పరిస్థితికి నైతిక బాధ్యత తెలంగాణ సర్కారుదే నని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. 
 
 కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి భాగ్యనగరంలో హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. గోషామహల్ ప్రాంతాన్ని తగలబెడతామని, రాజాసింగ్ ఎక్కడ కనపడితే అక్కడ దాడులు చేయాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, అతని తమ్ముడు రషీద్ ఖాన్ లను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
అసలు ఇప్పటివరకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలు అమాయకులని.. హిందువులే కావాలని రెచ్చగొడుతున్నారని.. పాత నగరంలో ప్రశాంత వాతావరణన్ని పాడు చేస్తున్నారని సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ ఆనంద్ కుమార్ వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. 
 
హిందువులు కావాలని ముస్లింలను కేసులలో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం.. ఇది హిందువుల మైండ్ గేమ్ అని, పోలీసులు ముస్లింల మధ్య హిందువులు గొడవలు పెడుతున్నారని స్వయానా అడిషనల్ డీసీపీ మాట్లాడటం చట్ట విరుద్ధం అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను హిందూ సమాజానికి ఆపాదిస్తూ కోర్టు పరిధిలో ఉండాల్సిన అంశాన్ని పక్కనపెట్టి, హిందూ సమాజాన్ని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ముమ్మాటికి నేరం అని స్పష్టం చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు.