ప్రముఖ బెంగాళీ రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన నవల ఆనందమఠ్ అనే నవల రచించిన వందేమాతర గీతాన్ని మన జాతీయ గేయంగా మనం స్వీకరించాం. ఆ పాట రాసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజరు కుట్టి, కృష్ణ కుమార్.బి, సూరజ్ శర్మ విడుదల చేశారు.
భారత స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నిర్మాతలు తమ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 1770ని ప్రకటించారు. ఎస్ఎస్ -1 ఎంటర్టైన్మెంట్, పికె ఎంటర్టైన్మెంట్ పతాకాలపై బాహుబభాషా చిత్రంగా ఈ సినిమాను బకించంద్ర ఛటర్జీ రాసిన ఆనంద్ మఠ్ అనే నవలను ఆధారంగా చేసుకుని రూపొందించబోతున్నారు.
పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వ శాఖలో ఈగ, బాహుబలి వంటి భారీ చిత్రాలకు పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. 2021లో విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ఆకాశవాణి’ సినిమాతో అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్ గంగరాజు మాట్లాడుతూ ”ఇది నాకు పెద్ద ఛాలెంజింగ్ సబ్జెక్ట్. అయితే లెజెండ్రీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ప్లేను అందించారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను మాత్రమే నేను తెరకెక్కించాలి. అద్బుతమైన పీరియాడిక్ సెట్స్, అద్భుతమైన ఎమోషన్స్, లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ తదితర ఎలిమెంట్స్ అన్నీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం” అని తెలిపారు.
“అలాంటి అన్ని ఎలిమెంట్స్ ఇందులో పక్కాగా సరిపోయాయి. ముందు కాస్త సందేహించాను. కానీ రామ్ కమల్గారితో మాట్లాడిన తర్వాత ఆయన విజన్ తెలసుకున్నాను. నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమాను తెరకెక్కించటానికి సిద్ధమయ్యాను” అని చెప్పారు.
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ”వందేమాతరం అనేది ఓ మ్యాజికల్ పదం. మంత్రాన్ని బకించంద్ర ఛటర్జీ అనే మహర్షి మనకు అందించారు. ఇది జాతినంతటినీ ఏకం చేసి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. 1770లో భారత స్వాతంత్య్ర సమరం కోసం మనలో స్ఫూర్తిని రగిల్చిన యోధులెందరో ఉన్నారు. వారి గురించి తెలియజేసే చిత్రమే 1770” అని వివరించారు.
రామ్ కమల్ మాట్లాడుతూ ”నా విజన్పై నమ్మకంతో ముందుకు వచ్చిన నిర్మాతలు చాలా గొప్పవారు. దర్శకుడిగా అశ్విన్లో పాజిటివ్ వైబ్స్ నాకు నచ్చాయి. తన సొంత ఆలోచనలతో నన్ను వచ్చి కలిశాడు. తను విజువల్గా స్టోరినంతంటినీ వివరించాడు. ఆయన మూవీ ఆకాశవాణి చిత్రాన్ని నేను చూశాను. నాకెంతగానో నచ్చింది” అని తెలిపారు.
”వందేమాతరం సినిమాను పాడుతూ పెరిగాం. అదే సమయంలో రామ్ కమల్ నన్ను కలిసి ఆనంద్ మఠ్ కథ గురించి చెప్పారు. విజయేంద్ర ప్రసాద్గారు ఆయన స్టైల్ ఆఫ్ నెరేషన్ను అందించారు. దాన్ని వినగానే చాలా బాగా నచ్చేసింది. ఈ అసాధ్యమైన కలను సుసాధ్యం చేస్తోన్న నా మిత్రులకు ధన్యవాదాలు. ఇది సినిమా కాదు.. నా కల నిజమవుతున్న రోజు. వెండితెరపై ఓ అద్భుతమైన చిత్రం ఆవిష్కఅతం కానుందని” అని శైలేంద్ర తెలిపారు.
జీ స్టూడియోస్పై హిస్టారికల్ బ్లాక్ బస్టర్ మణికర్ణిక చిత్రాన్ని రూపొందించిన సుజోరు కుట్టి మాట్లాడుతూ ”విజయేంద్రప్రసాద్గారితో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన ఈ సినిమాకు రైటర్ కాకుండా ఉండుంటే ఈ సినిమాను నేను చేసేవాడిని కాను” అని పేర్కొన్నారు.1770 చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాళీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా ఎవరు నటిస్తారనే విషయాన్ని టీమ్ దసరా ముందుగానే నిర్ణయిస్తుంది. దీపావళి నాటికంతా మొత్తం నటీనటులు, సాంకేతిక నిపుణులను అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతం దర్శకుడు అశ్విన్ తన టీమ్తో కలిసి ఈ పీరియాడిక్ సినిమాను యూనిక్గా రూపొందించడానికి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నారు.
More Stories
త్వరలో భారత్లోకి ఎయిర్ట్యాక్సీలు
తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్
సైద్ధాంతికంగా కాంగ్రెస్, లెఫ్ట్ దివాలా