పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి వద్ద ఓ ఉగ్రవాది ఏడుసార్లు రెక్కీ చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. కోల్ కతా లోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న మమత ఇంటి గురించి సమాచారం తెలుసుకునేందుకు ఉగ్రవాది రెక్కీ నిర్వహించాడని పోలీసులు గుర్తించారు. మూడంచెల భద్రతను తప్పించుకుని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించడం బెంగాల్లో కలకలం సృష్టించింది.
తన సెల్ ఫోన్ తో మమత నివాసాన్ని ఫొటోలు తీశారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాది రెక్కీ చేసిన సమయంలో స్థానిక పిల్లలకు టాఫీలతో రప్పించాడని దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ నెల 2, 3 తేదీల మధ్య రాత్రి హఫీజుల్ మొల్లా అనే ఉగ్రవాది భద్రతా ఏర్పాట్లను దాటి ముఖ్యమంత్రి నివాసంలోకి ఇనుపరాడ్ తో ప్రవేశించడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు.
నిందితుడి మొబైల్ ఫోన్లో సీఎం ఇంటి ఫొటోలు ఉన్నాయని పోలీసు అధికారి తెలిపారు. మొల్లా 11 సిమ్కార్డులను ఉపయోగిస్తున్నాడని, బంగ్లాదేశ్తో పాటు జార్ఖండ్, బీహార్లలోని ఫోన్ నంబర్లకు కాల్లు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
గతేడాది దుర్గాపూజ సందర్భంగా ఈదుకుంటూ బంగ్లాదేశ్కు వెళ్లి అక్కడ కొన్ని రోజులు బస చేశాడు. పొరుగు దేశంలో అతడి కార్యకలాపాల గురించి తెలుసుకునేందుకు అతడిని విచారిస్తున్నారు. మొల్లాకు ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు సూచనలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి చెప్పారు.
మరోవైపు మొల్లా పోలీసు కస్టడీని జులై 18 వరకు పొడిగిస్తూ సిటీ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రికి ఉన్న జెడ్-ప్లస్ భద్రతను ఉగ్రవాది ఎలా దాటాడు అనే ప్రశ్నలు తలెత్తాయి.ఈ ఘటన నేపథ్యంలో సీఎం నివాసం, పరిసరాల్లో భద్రతను అధికారులు పెంచారు. ఈ రెక్కీ వ్యవహారంపై సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్ను ఆయన పదవి నుంచి తొలగించారు.
More Stories
కేదార్ నాథ్ ధామ్ యాత్ర నేటి నుంచే
ప్రశాంతంగా మూడో దశలో 64.58% పోలింగ్
ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని ముడతల దుస్తులే