పశ్చిమ బెంగాల్ సృష్టి
ఆయన మొదటి చారిత్రక విజయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సృష్టించడానికి దారితీసింది. ఆయన బెంగాల్ మొత్తాన్ని జిన్నా పాకిస్తాన్ లోకి వెళ్ళకుండా నిరోధించారు. డాక్టర్ ముఖర్జీ 1947 లో బెంగాల్ విభజనను డిమాండ్ చేశారు. అందుకు అనుకూలంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించడంలో విజయవంతమయ్యారు.
జాతీయ, ప్రాంతీయ మద్దతును అందుకు అనుకూలంగా సమీకరించారు. బెంగాల్ రాజకీయ, సాంస్కృతిక, మేధో నాయకుల నుండి అధిక మద్దతు పొందారు. ఆ విధంగా ఆయన పశ్చిమ బెంగాల్ సృష్టికి కారకుడు కావడం ద్వారా దేశంలో కొంత భాగాన్ని కాపాడి, అది భారత దేశంలో అవిభాజ్యమైన ప్రాంతంగా అయ్యేవిధంగా చేయగలిగారు.
దశాబ్దాలుగా తూర్పు పాకిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్లలో మతపరమైన హింస కారణంగా పారిపోవలసి వచ్చిన పెద్ద సంఖ్యలో బెంగాలీ హిందువులు పశ్చిమ బెంగాల్ లో ఆశ్రయం పొందగలుగుతున్నారు.
భారతీయ జనసంఘ్ స్థాపన
డాక్టర్ ముఖర్జీ రెండవ చారిత్రాత్మక విజయం, అప్పటి ఆధిపత్య ధోరణులకు కేంద్రంగా నిలిచిన నెహ్రూవియన్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమంగా 1951 అక్టోబర్ 21 న భారతీయ జనసంఘ్ (బిజెఎస్) ను స్థాపించడం. జనసంఘ్ ద్వారా సరికొత్త రాజకీయ కథనాన్ని, ఉద్యమాన్ని ప్రారంభించారు.
జనసంఘ్ ను ప్రారంభించడం ద్వారా భారత దేశ పునర్జీవనం కోసం పనిచేస్తూ, భారతీయ సాంస్కృతిక విలువలు, పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించుకునే అవకాశం కలిగించారు. డాక్టర్ ముఖర్జీ జనసంఘ్ ప్రారంభ ప్రకటనలో ఈ విధంగా పేర్కొన్నారు:“భారతీయ జనసంఘ్ లక్ష్యం భారతీయ సంస్కృత, మర్యాద [విలువల] ఆధారంగా భారత్ పునర్నిర్మాణం; రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యంగా, వ్యక్తి సమానత్వం, స్వేచ్ఛను అందించే విధంగా, భారత్ ను ప్రగతిశీల, ఆధునిక, జ్ఞానవంతమైన విధానాలతో సుసంపన్న, శక్తివంత, ఐక్య దేశంగా మార్చి, ఇతరుల దూకుడు ఎత్తుగడలకు తట్టుకొని, ప్రపంచ శాంతి స్థాపన కోసం దేశాల మండలిలో తన ప్రభావాన్ని చూపగలదు.”
డాక్టర్ ముఖర్జీ 1953 లోనే మరణించినప్పటికీ, ఆయన సమర్ధవంతమైన నాయకత్వం కింద శిక్షణ పొందిన, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుండి వచ్చిన వారి సారధ్యంలో జనసంఘ్ భారత రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషింప గలిగింది.
బిజెఎస్ రాజకీయ వారసత్వం పుచ్చుకున్న బిజెపి డాక్టర్ ముఖర్జీ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెడుతూ, పూర్తిగా జాతీయవాదంతో, భారత దేశ గడ్డలో పాతుకు పోయిన విలువలతో ఆయన కలలను సాకారం చేయగలుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డాక్టర్ ముఖర్జీ ప్రవచించిన “ఒక దేశం, ఒకే రాజ్యాంగం” కలని సాకారం చేసారు. “ఏక్ భారత్, శ్రేష్త్ భారత్” దృష్టిని సాకారం చేయడానికి కృషి చేస్తున్నారు.
దేశ ఐక్యతకు బలిదానం
డాక్టర్ ముఖర్జీ మూడవ విజయం భారతదేశ ఐక్యత కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. పార్లమెంటులో, వెలుపల ఆయన జోక్యం లేని పక్షంలో జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో భాగంగా ఉండెడిది కాదు.
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని, జమ్మూ కాశ్మీర్ భారతదేశంతో పూర్తిగా విలీనం కావాలని ప్రజాభిప్రాయం సమీకరించడానికి ఆయన ప్రయత్నించి ఉండక పోతే, “ఏక్ దేశ్ మెయి దో విధాన్, దో నిషన్, దో ప్రధాన్, నాహి చాలెంజ్, నహి చాలెంగే” [ఒక దేశంలో, రెండు రాజ్యాంగాలు, రెండు చిహ్నాలు, ఇద్దరు ప్రధానులు చెల్లవు) అంటూ సింహ గర్జన చేయని పక్షంలో, కాశ్మీర్ భారత్ నుండి విడిపోకుండా చూడడం కోసం ఆయన కాశ్మీర్ పర్యటన చేయని పక్షంలో జమ్మూ కాశ్మీర్ ను మనం కోల్పోవలసి వచ్చెడిది.
ఈ ప్రాంతం పాకిస్తాన్ లో కలిసిపోయి ఉండెడిది. వేర్పాటువాదం, ఉగ్రవాద శక్తులు భారతదేశ బాల్కనైజేషన్ కు ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని డాక్టర్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఎందుకంటే దీని వల్లన జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రయోజనాలు, హక్కులను కోల్పోతున్నారు.
“ప్రజాస్వామ్య సమాఖ్య రాష్ట్రంలో, ఒక రాజ్యాంగ యూనిట్ పౌరుల ప్రాథమిక హక్కులు మరొక యూనిట్ పౌరులతో పోలిస్తే మారవు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మనం మిగిలిన భారత ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు అర్హత లేదా?” అంటూ ఆయన సింహ గర్జన చేశారు.
‘మీరు చేయబోయేది భారతదేశపు‘ బాల్కనైజేషన్’కు దారితీయవచ్చు, బలమైన సమైక్య భారత్ ను చూడకూడదనుకొనే వారిని బలపరచే విధంగా చేయవచ్చు’ అంటూ ఆయన ఆనాటి ప్రధాని నెహ్రూను హెచ్చరించారు.
ఆయన విజ్ఞప్తులు, ప్రయత్నాలన్నీ చెవిటి చెవిలో పడినప్పుడు, డాక్టర్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ సంపూర్ణ సమైక్యత కోసం ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం అత్యున్నత త్యాగం చేయడం ద్వారా, ఆయన ఆ రాష్ట్రం కోల్పోకుండా కాపాడారు. ఫలితంగా స్వతంత్ర భారతదేశం బాల్కనైజేషన్, విచ్ఛిన్నతను నిరోధించారు.
జమ్మూ సరిహద్దు వరకు ఆయనతో పాటు వచ్చిన ఆయన సన్నిహిత రాజకీయ శిష్యులలో ఒకరైన అటల్ బిహారీ వాజ్పేయి ఆయనను ‘భారత ఐక్యత, సమగ్రతకు కారణమైన మొదటి అమరవీరుడు’ అని కొనియాడారు.
More Stories
తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్
సైద్ధాంతికంగా కాంగ్రెస్, లెఫ్ట్ దివాలా
ఇరాన్పై క్షిపణులతో ఇజ్రాయిల్ ప్రతీకార దాడి