డిజిటల్ ఎకానమీ ఓ బంగారు బాతు

డిజిటల్ ఎకానమీ ఓ బంగారు బాతు వంటిదని అమెరికా-భారత్ వ్యాపార మండలి (యుఎస్ఐబిసి)  అధ్యక్షుడు అతుల్ కేశప్ అభివర్ణించారు. ఈ రంగం నిరంతరం బలోపేతం మవడానికి, వృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థలు, నిబంధనలు, చట్టపరమైన నియంత్రణలను అమెరికా, భారత దేశాల్లో ఏర్పాటు చేయాలని ఆయన  పిలుపునిచ్చారు. 
 
ఇండియా ఫౌండేషన్ బెంగళూరులో నిర్వహించిన ఇండియా ఐడియాస్ కాంక్లేవ్‌లో ‘‘కామర్స్ అండ్ ఇండస్ట్రీ 2.0’’ ప్యానెల్‌ను ఉద్దేశించి ఆయన ఆదివారం మాట్లాడారు. కేశప్ అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ మాజీ దౌత్యవేత్త. ఇటీవల ఆయన భారత దేశంలో అమెరికా దౌత్య కార్యాలయంలో ఛార్జ్ డిఅఫైర్స్‌గా పని చేశారు. 
చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్న భారత దేశ అభివృద్ధి, ప్రభుత్వ నేతృత్వంలో డిజిటైజేషన్ కృషి విజయవంతమవడం, వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశ హోదాల గురించి అతుల్ మాట్లాడారు. ఇరు దేశాలకు డిజిటల్ ఎకానమీ ట్రేడ్ బంగారు గుడ్లు పెట్టే బాతు వంటిదని ఆయన చెప్పారు.
అమెరికా, భారత దేశాల్లో డిజిటల్ ఎకానమీ నిరంతరం వృద్ధి చెందడానికి, నిరంతరం బలోపేతం కావడానికి వీలు కల్పించే వ్యవస్థలు, నిబంధనలు, చట్టపరమైన నియంత్రణలను ఏర్పాటు చేయాలని ఆయన  కోరారు.  భారతదేశంలో పెను విప్లవం జరుగుతోందని, దీని ప్రభావం భారత దేశం, అమెరికాలతో పాటు యావత్తు ప్రపంచంపైనా సకారాత్మకంగా  పెద్ద ఎత్తున ఉంటుందని పేర్కొన్నారు.
అనేక శతాబ్దాల అంతరాయాల తర్వాత భారత దేశం తిరిగి తన చారిత్రక హోదాకు వస్తోందని స్పష్టం చేశారు. ఈ భూమండలంపై అతిపెద్ద, అత్యంత చురుకైన, సౌభాగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత దేశం ఉండేదని ఆయన తెలిపారు.  అమెరికా-భారత దేశం మధ్య సహకారం ఉంటే ప్రపంచ ఆర్థిక సవాళ్ళలో కొన్నిటిని పరిష్కరించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.
సెమీకండక్టర్స్, రేర్ ఎర్త్ (భూమిలో ఉండే విలువైన లోహాలు) వంటి వాటి విషయంలో ఆధారపడదగిన, తట్టుకోగలిగిన, స్వేచ్ఛా ప్రపంచ సరఫరా వ్యవస్థలను నిర్మించడంలో అంతిమ పరిష్కార ప్రభావాన్ని సాధించగలమని ఆయన చెప్పారు. నూతన ఆవిష్కరణలు చేసే సమాజాలకు ఇంధనం, విద్యుత్తు, సహకారం అందజేయడానికి ఈ మెటీరియల్స్ చాలా ముఖ్యమైనవని ఆయన వివరించారు.
అంతర్జాతీయ కంపెనీల నుంచి నిరంతరం పెట్టుబడులను ఆకర్షించాలన్నా, అమెరికాతో నిరంతరం బలమైన వ్యాపార సంబంధాలను ఏర్పరుచుకోవాలన్నా భారత దేశం తప్పనిసరిగా ఆచరణ సాధ్యమైన, ఊహించదగిన విధానపరమైన వేదికను ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
సుస్థిరత, ముందుగా ఊహించదగిన పరిస్థితులు, పారదర్శకత, వ్యాపారాన్ని సులువుగా చేయగలగడం, సరళమైన విధానాలు, సమాన స్థాయిలో పోటీ పడేందుకు అవకాశాలుగల బరి ఉండటాన్ని పెట్టుబడిదారులు కోరుకుంటారని కేశవ్ చెప్పారు. అనుచిత ప్రయోజనాలను వారు కోరుకోరని స్పష్టం చేశారు.
అమెరికా-భారత్ వ్యాపార భాగస్వామ్యం 500 బిలియన్ డాలర్లకు చేరాలనే యుఎస్ ఐబిసి విజన్ గురించి ఆయన పేర్కొంటూ  భావి అభివృద్ధి, అవకాశాల వేదికగా డిజిటల్ ఎకానమీ నిలుస్తుందని తెలిపారు.
 
ప్రపంచ ఆర్థిక సవాళ్లలో కొన్నింటిని ఎదుర్కోవడంలో అమెరికా-భారత సహకారం సహాయపడ గలదని కేశప్ ఆశాభావం వ్యక్తం చేశారు. “మనం కలిగి ఉండవలసిన అన్ని విషయాల కోసం ఆధారపడదగిన, స్థితిస్థాపకంగా, స్వేచ్ఛా  ప్రపంచ సరఫరా గొలుసును నిర్మించడంలో మనం  సానుకూల ప్రభావాన్ని చూపగలము – ఇంధనం, శక్తిని అందించడం, ఇన్నోవేషన్ సొసైటీలకు మద్దతు ఇవ్వడం – సెమీకండక్టర్లు , అరుదైన భూమి వంటి వాటి కోసం,” అని ఆయన వివరించారు.