బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి ర్యాడిసన్ బ్లూ హోటల్ పై జరిపిన దాడులలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ ను సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు రాత్రి 3 గంటల సమయంలో దాడులు చేసి యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వీరందరినీ బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు. అయితే పోలీసులు తీసుకొచ్చిన యువకులు పోలీసు స్టేషన్ లో హంగామా సృష్టించారు. తమను ఎందుకు తీసుకొచ్చారంటూ ఆందోళన చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పబ్పై టాస్క్ఫోర్స్ అధికారులు డెకాయ్ ఆపరేషన్ చేశారు. డెకాయ్ ఆపరేషన్లో డ్రగ్స్ బాగోతం బట్ట బయలైంది. కాగా.. పబ్ నుంచి స్టేషన్కు తరలించిన 150 మందిలో కేవలం ఆరుగురిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులో ఉన్న వారి నుంచి అనుమానాస్పద ప్యాకెట్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పబ్లో దొరికిన డ్రగ్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పోలీసులు పంపిస్తున్నారు. పబ్లో అదుపులోకి తీసుకున్న వారిలో సినీ నటుడు కూతురు, ఆమె స్నేహితురాలు ఉన్నారు. ఇంకా బంజారాహిల్స్లోనే సినీ నటి, ఆమె స్నేహితురాలు ఉన్నారు. అలాగే మాజీ ఎంపీ అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
అందరినీ విచారించి, నోటీసులిచ్చి ఇచ్చి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు ప్రముఖుల కుటుంభం సభ్యులు కూడా వారిలో ఉన్నట్లు చెబుతున్నారు. పబ్ లో పోలీసులు డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది.
పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ పబ్ ఒక మాజీ ఎంపీ కుమార్తెది కావడంతో చాలారోజులుగా స్థానికుల నుండి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. రాత్రి మూడు గంటల వరకు పబ్ నడిచినా.. ఆ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరని బంజారాహిల్స్ పోలీసులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
More Stories
నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది
తెలంగాణాలో రెండంకెల సీట్లు.. కిషన్ రెడ్డి ధీమా
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదు