భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విటర్ ఖాతా ఆదివారం హ్యాక్ అయింది. రష్యా ప్రజలకు మద్దతుగా నిలవాలని, క్రిప్టోకరెన్సీ డొనేషన్స్ ఇవ్వాలని కోరుతూ ఓ ట్వీట్ను హ్యాకర్లు పెట్టారు. అయితే కొద్ది నిమిషాల్లోనే ఈ ట్వీట్ను తొలగించారు.
‘రష్యా ప్రజలకు మద్దతుగా నిలుద్దాం. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ డొనేషన్స్, బిట్కాయిన్, ఎథిరియమ్ విరాళాలను స్వీకరిస్తున్నాం’’ అని ఈ ట్వీట్ పేర్కొంది. ఈ మాటలను ఇంగ్లిష్లో రాశారు. హిందీలో, ‘‘ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలుద్దాం. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విరాళాలను స్వీకరిస్తున్నాం’’ అని రాశారు.
ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో నడ్డా ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రతిపాదించిన తీర్మానానికి జరిగిన ఓటింగ్ నుంచి భారత్, చైనా, యూఏఈ గైర్హాజరయ్యాయి. ఉక్రెయిన్పై యుద్ధాన్ని తక్షణమే ఆపాలని రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే రష్యా వీటో అధికారాన్ని వినియోగించి, ఈ తీర్మానం వీగిపోయేలా చేసింది.
More Stories
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!
అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు