కరోనాడో రెం వేవ్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువగానే ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. మూడో వచ్చినప్పటికీ.. భారత్లో వినియోగ శక్తిపై ప్రభావం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చింది. కరోనా కారణంగా సేవా రంగంపై అధిక ప్రభావం పడినట్టు వెల్లడించింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రసంగం అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వార్షిక ఆర్ధిక సర్వే కరోనా రెండో వేవ్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువగానే ఉందని వెల్లడించింది. మూడో వచ్చినప్పటికీ.. భారత్లో వినియోగ శక్తిపై ప్రభావం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చింది.
కరోనా కారణంగా సేవా రంగంపై అధిక ప్రభావం పడినట్టు వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కరోనా ముందు స్థాయికి చేరుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా సమయంలోనూ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని, ఇందుకు కారణం ప్రభుతం సమయస్ఫూర్తిగా వ్యవహరించడమే అని ఆర్థిక సరే వెల్లడించింది.
ఓ వైపు కరోనా మహమ్మారి అరికట్టే చర్యలు.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మద్దతు చర్యలు కేంద్ర ప్రభుతం చేపట్టిందని తెలిపింది. భారత్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మరో ముఖ్య కారణం డిమాండ్ నిర్వహణపై పూర్తిగా ఆధారపడకుండా.. సరఫరా సంస్కరణల వైపు దృష్టి సారించిందని ఆర్థిక సర్వే తెలిపింది.
సరఫరా వైపు సంస్కరణల్లో భాగంగా.. అనేక రంగాల నియంత్రణ సడలింపు, ప్రక్రియల సరళీకరణ, రెట్రోస్పెటివ్ ట్యాక్స్ వంటి సమస్యల తొలగింపు, ప్రైవేటీకరణ, ఉత్పత్తి, సంబంధిత ప్రోత్సాహకాలు మొదలైనవి ఉన్నట్టు తెలిపింది.
దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కరోనా ముందు స్థాయికి చేరుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా సమయంలోనూ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని, ఇందుకు కారణం ప్రభుతం సమయస్ఫూర్తిగా వ్యవహరించడమే అని ఆర్థిక సరే వెల్లడించింది. ఓ వైపు కరోనా మహమ్మారి అరికట్టే చర్యలు.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మద్దతు చర్యలు కేంద్ర ప్రభుతం చేపట్టిందని తెలిపింది.
కరోనా సమయంలో కేంద్రం చర్యలు గత ఆర్థిక సరేలోనే చర్చించినట్టు గుర్తు చేసింది. భారత్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మరో ముఖ్య కారణం డిమాండ్ నిర్వహణపై పూర్తిగా ఆధారపడకుండా.. సరఫరా సంస్కరణల వైపు దృష్టి సారించిందని ఆర్థిక సర్వే తెలిపింది. సరఫరా వైపు సంస్కరణల్లో భాగంగా.. అనేక రంగాల నియంత్రణ సడలింపు, ప్రక్రియల సరళీకరణ, రెట్రోస్పెటివ్ ట్యాక్స్ వంటి సమస్యల తొలగింపు, ప్రైవేటీకరణ, ఉత్పత్తి, సంబంధిత ప్రోత్సాహకాలు మొదలైనవి ఉన్నట్టు తెలిపింది.
ప్రభుత్వ మూలధన వ్యయంలో భారీ పెరుగుదల కూడా డిమాండ్, సరఫరాను మెరుగుపర్చిన దానికి ప్రతిఫలంగా చూడొచ్చని సర్వే తెలిపింది. ఇది భవిష్యత్తులో మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం ప్రపంచ సమస్యగా కనిపిస్తోందని పేర్కొంది.
అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం ఉంటుందని, ఇలాంటి దిగుమతి ద్రవ్యోల్బణం పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని సర్వే పేర్కొంది. వివిధ రంగాల స్థితితో పాటు వృద్ధిని వేగవంతం చేయడానికి సంస్కరణలను కూడా ఈ సర్వే సూచించింది.
భారత్ ఆర్థిక వ్యవస్థ స్థితిని మెరుగుపర్చేందుకు సరఫరా, సమస్యల వైపు దృష్టి సారించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం నుంచి 6.5 శాతం అంచనా వేయగా.. మైనస్ 7.3 శాతంగా నమోదైంది.
2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే.. మౌలిక రంగంలో 1.4 ట్రిలియన్ డాలర్లను వెచ్చించాల్సి ఉంటుందని తెలిపింది. 2008-17 మధ్య కాలంలో మొత్తం 1.1 ట్రిలియన్ డాలర్లను మౌలిక రంగంలో పెట్టినట్టు సర్వే పేర్కొంది.
2020-25 ఆర్థిక సంవత్సరాల మధ్య దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల లక్ష్యంతో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (ఎన్ఐపీ) కేంద్రం ప్రవేశపెట్టినట్టు తెలిపింది.
ఆత్మ నిర్భర్ భారత్ను కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. నిర్మాణాత్మక, విధానపరమైన సంస్కరణలు, రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్, కోర్ కాంపిటెన్సీ, అత్యాధునిక సాంకేతికత రంగాల్లో పెట్టుబడులను ఆకర్శించేందుకు రూపొందించిన వివిధ పీఎల్ఐ స్కీమ్స్, దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం, కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపుతో సహా ఆత్మ నిర్భర్ భారత్ కింద కార్యక్రమాలు చేపట్టినట్టు గుర్తు చేసింది.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్