ప్రతికూల వాతావరణమే ఆర్మీ స్టాఫ్ ఆఫ్ చీఫ్ బిపిన్ రావత్ సహా 13 మంది చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ‘కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ’లో నిర్ధారించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత నెల 8న తమిళనాడులోని కూనూర్కి సమీపంలో రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వి5 హెలికాప్టర్ ప్రమాదవశాత్తు ప్రతికూల వాతావరణంలోకి వెళ్లి చిక్కుకుపోయిందని, అంతే తప్ప అందులో ఎలాంటి సాంకేతిక, యాంత్రిక తప్పిదాలు దొర్లలేదని నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఆ రోజు వాతావరణం బాగలేకపోవడంతో దట్టమైన పొగమంచు కారణంగా ముందు ఏమీ కనిపించని పరిస్థితి ఉందని, హెలికాప్టర్ క్రాష్కావడానికి ఇదే కారణం కావచ్చని ఆర్మీ వర్గాలు చెప్పాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే అనుకోకుండా హెలికాప్టర్ చెట్లను ఢీకొట్టి క్రాష్అయి ఉండొచ్చని ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో ఒక నిర్ణయానికి వచ్చారని చెప్తున్నారు. హెలికాప్టర్ లో సాంకేతిక, మెకానికల్ లోపాలకు ఎలాంటి అవకాశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
ఈ నివేదికను త్వరలో ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరికి సమర్పించనున్నారు. ప్రస్తుతం తుది నివేదికను వైమానిక దళం న్యాయవిభాగం పరిశీలిస్తోంది. కాగా, ఈ నివేదికపై ప్రభుత్వం గానీ..వైమానిక దళం గానీ.. ఇప్పటి వరకు స్పందించలేదు.
More Stories
శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!