జనవరిలోగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ నిరుద్యోగ దీక్షలో మాట్లాడుతూ బీజేపీ దీక్ష అంటే కేసీఆర్ కు వణుకు పుట్టిందని పేర్కొన్నారు. బీజేపీ నిరుద్యోగ దీక్షకు వేలాది మంది కార్యకర్తలు తరలివస్తున్నారనే సమాచారంతో కేసీఆర్ కు కరోనా గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు.
భయంతోనే బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతివ్వలేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ వచ్చిందని పేర్కొంటూ ఉద్యోగాలు సాధించని తెలంగాణ ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులపై కేసీఆర్ కు కక్ష్య ఎందుకని నిలదీశారు. ఉద్యోగాల కోసం దీక్షలు చేయాల్సి వస్తుందనుకోలేదని విచారం వ్యక్తం చేశారు.
విద్యా వాలంటీర్లను తొలగించిన మూర్ఖుడు కేసీఆర్ అని అంటూ దయ్యబట్టారు బండి సంజయ్. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారని, ఫిల్డ్ అసిస్టెంట్లను పీకేశారని విమర్శించారు. లక్షా 90 వేల ఉద్యాగాల ఖాళీగా ఉన్నాయనని బిశ్వాల్ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు.
జనవరి లోపల వెంటనే ఉద్యోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే కేసీఆర్ ను తిరగనివ్వమని సంజయ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ, బయట బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ నడవకుండా అడ్డుకుంటారని హెచ్చరించారు. కేసీఆర్ ను అడిగితే దొంగ దీక్షలు ఎలా చేయాలో చెబుతారని ఎద్దేవా చేశారు.
ఖమ్మంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
కేసీఆర్ ప్రభుత్వంకు కాలం చెల్లింది
More Stories
నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది
తెలంగాణాలో రెండంకెల సీట్లు.. కిషన్ రెడ్డి ధీమా
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదు