న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రజాసమస్యలు, హక్కుల పరిరక్షణలో వారు కీలకపాత్ర పోషించాలని, వారి శక్తి సామర్థ్యాలు, విజ్ఞానం సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని హితవు పలికారు.
తెలుగువాడిగా మీ అందరి అభిమానం, ఆదరణ, మద్దతుతో భారతదేశ న్యాయవ్యవస్థ కీర్తిని మరింత ఇనుమడింపజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టులో ఎక్కువ కేసులు ఉన్నాయని తెలుసని.. న్యాయమూర్తుల కొరత ఉందని, వీలైనంత త్వరగా కొత్త జడ్జీలను నియమిస్తామని తెలిపారు.
మిగిలిన ఖాళీలు కూడా భర్తీ చేసేందుకు హైకోర్టు సీజే కు లేఖ రాశామని, పేర్లు పంపితే ఆమోదిస్తామని తెలిపామని పేర్కొన్నారు. హైకోర్టు ఆవరణలో రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ బార్ కౌన్సిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ రమణ దంపతులకు శాలువా కప్పి, గజమాలతో సత్కరించా రు.
సుప్రీంకోర్టు న్యా యమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పి.ఎ్స.నరసింహలతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా ను కూడా సత్కరించారు.
More Stories
అరెస్ట్ కు ఈసీ ఆదేశంతో ఎమ్యెల్యే పిన్నెల అరెస్ట్
ఎన్నికల హింస నిందితులపై హత్యాయత్నం, కుట్ర ఆరోపణలు
పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే