పురాతన నగరంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున పెంచాలని భావిస్తున్న మెగా ప్రాజెక్టు వారణాసి నడిబొడ్డున ఉన్న ప్రతిష్టాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ కారిడార్ను ప్రారంభించిన తర్వాత, నది క్రూయిజ్లో పలువురు ముఖ్యమంత్రులతో ప్రధాని అనధికారిక సమావేశాన్ని నిర్వహిస్తారు.
వారణాసి ఘాట్లలో గంగా ‘ఆరతి’, గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారని ఒక ఉన్నత అధికారి తెలిపారు. ఐకానిక్ దశాశ్వమేధ ఘాట్ సమీపంలోని చారిత్రాత్మక కాశీ విశ్వనాథ దేవాలయం చుట్టూ అత్యాధునిక మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవం చేయడంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోనున్నాయి.
గేట్వేలు, ఇతర నిర్మాణాలు సాంప్రదాయ హస్తకళను ఉపయోగించి రాళ్ళు, ఇతర వస్తువులతో నిర్మించారు. మధ్యాహ్నం 1 గంటలకు మోదీ ఆలయాన్ని సందర్శిస్తారని, ప్రార్థనలు చేసిన తర్వాత సుమారు రూ 339 కోట్లతో నిర్మించిన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ మొదటి దశను ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
పవిత్ర నదిలో స్నానం చేసి, ఆ నీటిని సేకరించి, నైవేద్యంగా సమర్పించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. రద్దీగా ఉండే వీధులు, పరిసరాలను సరిగా లేకపోవడంతో యాత్రికులు, శివ భక్తులకు సౌకర్యాలు కల్పించే ప్రతిపాదనలు చాలా కాలంగా ప్రధాని ప్రతిపాదిస్తున్నారు.
“ఈ దృక్పథాన్ని సాకారం చేసేందుకు, శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని గంగా నది ఒడ్డుకు కలిపేలా సులభంగా చేరుకోగల మార్గాన్ని రూపొందించే ప్రాజెక్ట్గా శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ రూపొందించారు” అని అని ప్రధాని కార్యాలయంపేర్కొంది. ప్రాజెక్ట్ అన్ని దశలలో ప్రధాన మంత్రి చాలా చురుకైన ఆసక్తిని కనబరిచారు. వారణాసికి ప్రధాని ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.
ప్రాజెక్ట్ను మెరుగుపరచడానికి, వికలాంగులతో సహా యాత్రికుల కోసం మరింత అందుబాటులో ఉండేలా చేయడానికి అయన క్రమం తప్పకుండా సమీక్షలు జరుపుతూ, పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం 23 భవనాలను ప్రారంభిస్తారు. యాత్రికుల కోసం యాత్రికులకు వివిధ సౌకర్యాలు కల్పిస్తారు.
వాటిలో ‘యాత్రి సువిధ కేంద్రాలు’, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, వేద కేంద్రం, ముముక్షు భవన్, భోగశాల, సిటీ మ్యూజియం, వ్యూయింగ్ గ్యాలరీ, ఫుడ్ కోర్ట్ తదితరాలు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో ఆలయం చుట్టూ ఉన్న 300 కంటే ఎక్కువ ఆస్తులను కొనుగోలు చేయడం, స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ప్రాజెక్ట్ స్థాయి ఇప్పుడు దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అయితే ఇంతకుముందు ప్రాంగణాలు కేవలం 3,000 చదరపు అడుగులకే పరిమితం చేశారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్ పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యాయని పిఎంఓ పేర్కొంది.
ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో 50,000 నుండి 75,000 మంది వరకు భక్తులు ఒకేసారి రావచ్చు. మందిర్ చౌక్ లో భక్తులు సేద తీర్చుకోవడం, ధాన్యం చేయడం చేయవచ్చు. రోజుకు 2 లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు.
ఆలయం ప్రస్తుత నిర్మాణాన్ని 1780లో మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. 19వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ దీనిని బంగారు ‘శిఖర్’తో పట్టాభిషేకం చేశారు. కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం, ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ అని కూడా పిలుస్తారు. చాలా పాత మ్యాప్లలో, ఈ పేరు ప్రస్తావించబడిందని చూడవచ్చు.
మందిరానికి దారితీసే వీధుల్లో ఉన్న భవనాల ముఖభాగాలు ఏకరీతి లేత గులాబీ రంగులో పెయింట్ చేశారు. అనేక భవనాలు విద్యుత్ దీపాలతో ప్రకాశిస్తున్నాయి. గోదోలియా చౌక్కు సమీపంలో ఉన్న అనేక హోటళ్లను కూడా ఈ సందర్భంగా యజమానులు విద్యుత్ దీపాలతో వెలిగించారు.
కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం తర్వాత వారణాసిలో నెల రోజుల పాటు సాంస్కృతిక వ్యాయామాలు నిర్వహించనున్నట్లు సీనియర్ బిజెపి నాయకులు గతంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా 51,000 ప్రదేశాల నుండి ప్రత్యక్ష ప్రసారం చేసే ఈ వేడుకకు బిజెపి ముఖ్యమంత్రులు, డిప్యూటీ సిఎంలు అందరూ హాజరవుతారని ప్రకటించారు.
కారిడార్కు శంకుస్థాపన చేసిన తర్వాత, దేవాలయాల “రక్షణ, సంరక్షణ”, పురాతన విశ్వాసంతో ఆధునిక సాంకేతికత కలయికకు ఈ ప్రాజెక్ట్ ఒక నమూనాగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. గత డిసెంబర్లో ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్, సైట్ను అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆలయం అసలు నిర్మాణాన్ని తారుమారు చేయలేదని, ఈ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, పర్యాటక సౌకర్యాలు మెరుగుపరచామని తెలిపారు.
“ఈ ప్రాజెక్ట్లో టెంపుల్ చౌక్, వారణాసి సిటీ గ్యాలరీ, మ్యూజియం, మల్టీపర్పస్ ఆడిటోరియంలు, హాలు, భక్తుల సౌకర్యాల కేంద్రం, ప్రజల సౌకర్యార్థం, సాల్వేషన్ హోమ్, గోదోలియా గేట్, భోగశాల, పూజారులు, సేవాదార్లకు ఆశ్రయం, ఆధ్యాత్మిక పుస్తక స్థలం, ఇతర నిర్మాణాలు ఉన్నాయి” అని పటేల్ వివరించారు.
ప్రాజెక్ట్ 5.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 70 శాతం గ్రీన్ కవర్ కోసం ఉంచారు. “ఆలయ ప్రాంగణాన్ని దాని వైభవాన్ని పునరుద్ధరించడానికి పునర్వ్యవస్థీకరించాలనే ప్రధాన మంత్రి దృష్టిని నెరవేర్చడానికి మేము పని చేసాము” అని పటేల్ పేర్కొన్నారు.
ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న భవనాలను కూల్చివేయడంతో 40 పురాతన ఆలయాలు కనిపించాయని వారణాసి డివిజనల్ కమిషనర్ దీపక్ అగర్వాల్ గతంలో తెలిపారు. ఇంతకు ముందు మరుగున పడిన ఈ శతాబ్దాల నాటి ఆలయాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వాటిని భద్రపరచి, తిరిగి ప్రజలకు తెరవనున్నారు.
“ప్రధానమంత్రి సోమవారం ఉదయం వారణాసి విమానాశ్రయానికి చేరుకొని, అక్కడ నుండి హెలికాప్టర్ లో సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం క్యాంపస్కు వెడతారని వారణాసి జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ తెలిపారు. అక్కడ తాత్కాలిక హెలిప్యాడ్ తయారు చేశారు. ఆ తర్వాత కాల భైరవ మందిరానికి దేవుడి దర్శనం కోసం వెళతారు. ఆపై నది మార్గంలో ప్రయాణించి కారిడార్కు ఆనుకుని ఉన్న ఘాట్కు చేరుకుంటారు.
ప్రధాని మోదీ ఘాట్ వైపు నుండి కాశీ విశ్వనాథ్ ధామ్కు చేరుకుంటారు, ఆపై కారిడార్ను ప్రారంభిస్తారు. కొత్త కారిడార్ ప్రాంగణంలో ఆయన పాదయాత్ర చేసి, నిర్మించిన భవనాలను చూస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో సాధువులు, జ్ఞానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
డిసెంబరు 13న ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దాదాపు 3,000 మంది సాధు సంతతులు, వివిధ మతపరమైన మఠాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, కళాకారులు, ఇతర ప్రముఖ వ్యక్తులు వేదిక వద్ద సమావేశమవుతారు. కార్యక్రమం దాదాపు 2-3 గంటల పాటు కొనసాగుతుంది.
“సాయంత్రం, ప్రధానమంత్రి నది క్రూయిజ్లో సిఎంలు, డిప్యూటీ సిఎంలతో అనధికారిక ‘బైఠక్’లో పాల్గొంటారు. వారణాసి ఎంపీగా ఉన్నందున, నది ఒడ్డున ఉన్న కాశీ వైభవాన్ని ముఖ్యమంత్రులకు ప్రదర్శించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలాగే, తన క్రూయిజ్ నుండి, ప్రధాని గంగా ‘ఆరతి’, ఘాట్లపై గొప్ప ఉత్సవాలను చూస్తారు. ఇది బాణాసంచా, లేజర్ షోతో ముగుస్తుంది” అని కలెక్టర్ వివరించారు.
ఘాట్లపై ఐదు లక్షల దీపాలను వలిగించి, ఈ సందర్భంగా ‘దేవ్ దీపావళి’గా నిర్వహించాలని సన్నాహాలు చేశారు. ప్రధాని ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ క్యాంపస్లోని అతిథి గృహంలో బస చేస్తారు. మరుసటి రోజు, ఆయన ముఖ్యమంత్రులతో, ఇతర కార్యక్రమాలతో అధికారిక సమావేశంలో పాల్గొంటారు. తరువాత రోజు ఉమ్రాహాలోని స్వర్వేద్ మందిర్ వార్షిక కార్యక్రమంలో పాల్గొంటారు.
More Stories
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన