చాలామంది భారతీయులు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టినప్పటికీ.. పటిష్టమైన ఫ్రేమ్వర్క్ లేకపోవడం పెట్టుబడిదారులకు అధికనష్టాలకు దారితీస్తోంది. 71 శాతంమంది నిపుణులు కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని లోకల్ సర్కిల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సచిన్ తపారియా తెలిపారు.
క్రిప్టోకరెన్సీల కారణంగా ఎదురయ్యే నష్టాలను ఫ్లాట్ ఫారమ్లు, ఎక్సేంచీలపై ప్రకటనలు నష్టాలను హైలెట్ చేయడం లేదని తపారియా పేర్కొన్నారు. 76 శాతం మంది నిబంధనలు సిద్ధమయ్యే వరకు ఈ ప్రకటనలను నిలిపివేయాలని కోరినట్లు సర్వేలో తేలింది.
డిజిటల్ కాయిన్ల్లో లావాదేవీల విలువ పెరిగినప్పటికీ సుమారు 70 శాతం నుండి 80 శాతం ఖాతాలు (27 డాలర్లు) 2వేల కంటే తక్కువ మొత్తం బ్యాలెన్స్గా కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలపడం గమనార్హం. సుమారు 87 శాతం కుటుంబాలకు క్రిప్టోకరెన్సీలో వ్యాపారం చేయడం లేదా పెట్టుబడి పెట్టడం లేదు.
మరోవంక, క్రిప్టో కరెన్సీలపై పూర్తి నిషేధం విధించడం వల్ల డిజిటల్ కరెన్సీతో చట్టవిరుద్ధ కార్యక్రమాలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. క్రిప్టోలపై పూర్తి నిషేధం రాజ్యేతర శక్తులు వాటిని మరింత చట్ట విరుద్ధ కార్యకలాపాలకు వినియోగించే ముప్పు పొంచి ఉందని ఐఎఎంఏఐ అనుబంధ ఇండస్ట్రీ బాడీ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కౌన్సిల్ (బీఏసీసీ) హెచ్చరించింది.
గురువారం ఓ ప్రకటనలో పేర్కొందిది. ఐఎఎంఏఐ అంటే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్. క్రిప్టో కరెన్సీలను కేవలం ఆస్తిగానే ఉపయోగించుకునేందుకు అనుమతించాలని సూచించింది. భారత్ కరెన్సీకి ఆల్టర్నేటివ్గా వాడితే దేవ ద్రవ్య పరపతి విధానం, ద్రవ్య నియంత్రణల్లో క్రిప్టో కరెన్సీల జోక్యం పెరుగుతుందని బీఏసీసీ వివరించింది.
కనుక భారతీయులు కరెన్సీగా క్రిప్టోలను వాడకుండా చట్టపరంగా ఆంక్షలు విధించడానికి అనుకూలమని తెలిపింది. కాగా క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 ఈ శీతాకాల పార్లమెంట్ సెషన్ లో పార్లమెంట్ ముందుకురానుంది.
More Stories
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన
నేరస్తులైన రాజకీయ నేతలను అరెస్టు చేయకుండా ఎలా?