ఎవరికి గులాం గిరి, బానిసత్వం చేయటానికి ఢిల్లీలో పార్టీ కార్యాలయం కడ్తున్నారో టీఆర్ఎస్ చెప్పాలని
ఢిల్లీకి హరీశ్ రావు ఎందుకు వెళ్ళలేదు? టీఆర్ఎస్ పార్టీలో తన స్థానమేంటో హరీశ్ చెప్పాలని నిలదీశారు. దుబ్బాక, హుజురాబాద్ లలో ఎట్టి చాకిరీ చేయటానికి మాత్రమే ఆయన్ను వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ఆం ధ్ర నేతల మోచేతి నీళ్ళు తాగుతున్నడే బీజేపీ చిన్న రాష్ట్రల ఏర్పాటును సమర్థించిందని రఘునందనరావు గుర్తు చేశారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను విమర్శించి ప్రజల్లో పలుచన కావొద్దని టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ఆయన హితవు చెప్పరు. 1996లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడని బిజెపి ఎమ్యెల్యే ప్రశ్నించారు. బీజేపీ చిన్న రాష్ట్రల ఏర్పాటును ఏనాడో సమర్థించిందని గుర్తు చేశారు.
గోదావరి జలాల కోసం విద్యాసాగరరావు పాదయాత్ర చేసినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని రఘునందనరావు ప్రశ్నించారు. తెలంగాణకు హక్కు దారులు తామే అన్నట్లు టీఆర్ఎస్ నేతలు వ్యవహరించటం సరైంది కాదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి జలదృశ్యం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే పరామర్శించని చరిత్ర కేసీఆర్ దని దుయ్యబట్టారు.
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ
రేవంత్రెడ్డి, కేసీఆర్ వీణా వాణిలాగా అవిభక్త కవలలు