ఎవరికి గులాం గిరి కోసం ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం!

ఎవరికి గులాం గిరి, బానిసత్వం చేయటానికి ఢిల్లీలో పార్టీ కార్యాలయం కడ్తున్నారో టీఆర్ఎస్ చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఎన్  రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో స్థలం తీసుకుని..రాష్ట్రంలో ఇతర పార్టీల కార్యాలయాలకు స్థలం ఇవ్వని కుసంస్కారం టీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఢిల్లీకి హరీశ్ రావు ఎందుకు వెళ్ళలేదు? టీఆర్ఎస్ పార్టీలో తన స్థానమేంటో హరీశ్  చెప్పాలని నిలదీశారు. దుబ్బాక, హుజురాబాద్ లలో ఎట్టి చాకిరీ చేయటానికి మాత్రమే ఆయన్ను వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ఆం ధ్ర నేతల మోచేతి నీళ్ళు తాగుతున్నడే బీజేపీ చిన్న రాష్ట్రల ఏర్పాటును సమర్థించిందని రఘునందనరావు గుర్తు చేశారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను విమర్శించి ప్రజల్లో పలుచన కావొద్దని టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ఆయన హితవు చెప్పరు. 1996లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడని బిజెపి ఎమ్యెల్యే ప్రశ్నించారు. బీజేపీ చిన్న రాష్ట్రల ఏర్పాటును ఏనాడో సమర్థించిందని గుర్తు చేశారు.

గోదావరి జలాల కోసం విద్యాసాగరరావు పాదయాత్ర చేసినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని రఘునందనరావు ప్రశ్నించారు. తెలంగాణకు హక్కు దారులు తామే అన్నట్లు  టీఆర్ఎస్   నేతలు వ్యవహరించటం సరైంది కాదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి జలదృశ్యం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే పరామర్శించని చరిత్ర కేసీఆర్ దని దుయ్యబట్టారు.