దాదాపు మొత్తం ఆఫ్ఘానిస్తాన్ ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నా గత రెండు శతాబ్దాలుగా దురాక్రమణదారులు ఎవ్వరికీ లొంగకుండా, తాలిబన్లను అడుగు పెట్టనీయకుండా ఎదుర్కొంటున్న పంజ్షీర్ లోయను ఆక్రమించడం మాత్రం సాధ్యం కావడం లేదు. ఓ వైపు దాడులు.. మరోవైపు చర్చలతో పంజ్షీర్ను దారిలోకి తెచ్చుకోవాలనుకొన్న వారి ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. వెరసి అఫ్గాన్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తాలిబన్లు పంజ్షీర్ను మాత్రం తమ నియంత్రణలోకి తెచ్చుకోలేకపోతున్నారు.
ఉత్తర కూటమి పంజ్షీర్ లోయ, సమీప ప్రాంతాలలో తాలిబాన్లతో తీవ్రంగా పోరాడుతుండగా, అహ్మద్ మసౌద్, అమ్రుల్లా సలేహ్ నేతృత్వంలోని సైన్యం బుధవారం 300 మంది ఉగ్రవాదులను నిర్మూలించామని, 130 మందిని పట్టుకున్నామని ప్రకటించింది. షాటెల్, జబల్ సిరాజ్ తప్పెహ్ సోర్క్, సలాండ్, అండరాబ్ జిల్లాలలో జరిగిన పోరాటంలో ఉగ్రవాద గ్రూపు నుండి డజన్ల కొద్దీ భారీ ఆయుధాలతో సహా వెయ్యికి పైగా తుపాకులను కలిగి ఉన్న సైన్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది.
ఉగ్రవాదుల నుండి, 15 హమ్వీస్, 1000 కళాష్నికోవ్ రైఫిల్స్, 15 పైక్ బేస్లు, 15 ఆర్పిజె రాకెట్ లాంచర్లు, పెద్ద మొత్తంలో కలష్నికోవ్, పైక్ మరియు రాకెట్-ఆధారిత గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది.
పంజ్షీర్ నేతలతో తాలిబన్లు తలపెట్టిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. తాము తాలిబన్లకు తలవంచేది లేదని పంజ్షీర్ తేల్చిచెప్పింది. ‘సోదరులారా.. చర్చల ద్వారా పంజ్షీర్ సమస్యను పరిష్కరించడానికి సాధ్యమైనంత ప్రయత్నించాం. కానీ చర్చలు విఫలం అయ్యాయి. సమస్యకు శాంతియుతంగా పరిష్కారం లభించడం పంజ్షీర్ గ్రూపుల నాయకులకు ఇష్టం లేదు’ అంటూ చర్చలకు నేతృత్వం వహించిన తాలిబన్ నేత ముల్లా అమీర్ ఖాన్ ఆరోపించారు.
“వారు యుద్ధం కోరుకొంటున్నారు. కానీ యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని మీరైనా వారికి చెప్పండి’ అంటూ చర్చలకు పంజ్షీర్ ప్రజలకు ట్విట్టర్ ద్వారా ఆడియో సందేశం ఇచ్చారు. అమెరికా బలగాలు వెళ్లిపోగానే తాలిబన్లు పంజ్షీర్పై దాడికి బయల్దేరారు. తాము పంజ్షీర్ లోయలోకి ప్రవేశించామని, షుతార్ జిల్లాను స్వాధీనం చేసుకొన్నామని ప్రకటించారు.
పంజ్షీర్కు కొత్త గవర్నర్ను నియమించినట్టు ముల్లా అమీర్ ఖాన్ ప్రకటించారు. పంజ్షీర్లో స్థానిక గ్రూపులు తాలిబన్లకు సహకరించాలని సూచించారు. అయితే భీకర పోరాటం జరుగుతున్నదని, 300 మందికి పైగా తాలిబన్లు ఈ పోరాటంలో చనిపోయారని పంజ్షీర్ నేతలు ప్రకటించారు.
త్వరలోనే తాలిబన్ల కొత్త ప్రభుత్వం
మరోవంక, అఫ్ఘనిస్థాన్లో త్వరలోనే తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నాడని, తాలిబన్ల సుప్రీం కమాండర్ హైబతుల్లా అఖుంద్జాదానే ఇక్కడ ఏర్పడే ఎటువంటి పాలక మండలికి అయినా సారధి, అధినేత అవుతాడని తాలిబన్ల సాంస్కృతిక వ్యవహారాల కమిషన్ సభ్యులు బిలాల్ కరిమి ప్రకటించారు.
సంస్థ అత్యున్నత నేత అఖుంద్జాదాకు నమ్మకస్తులు, దూతలుగా ఉండే ముగ్గురు నేతలలో ప్రధాన వ్యక్తి అయిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదరి ప్రభుత్వ దైనందిన కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలో ఉంటారని బిలాల్ తెలిపారు. ఇప్పటివరకూ ఘనీ బరాదరినే తాలిబన్ ప్రధాన వ్యక్తిగా బహిరంగంగా బయట తరచూ కన్పిస్తూ వస్తున్నారు.
హైబతుల్లా ఎక్కడా ప్రజల ముందుకు రాలేదు. ఇస్లామిక్ ఎమిరేట్స్ నేతల పరిధిలోనే సంఘటిత, సమ్మిశ్రిత ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. దీనికి సంబంధించిన సంప్రదింపుల క్రమం అధికారికంగా ఇక ముగిసినట్లే అని బిలాల్ తెలిపారు.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్