కశ్మీర్ వేర్పాటు వాద నాయకుడు, కాశ్మీర్ ను పాకిస్థాన్ లో విలీనం చేయాలని సూచించిన పాకిస్థాన్ అనుకూల నేత సయ్యద్ అలీ షా గిలానీ బుధవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 92 ఏండ్లు. వేర్పాటు వాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ పదవి నుంచి గిలానీ జూన్లో వైదొలిగారు.
అతని అంత్యక్రియలకు పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా సంస్థ ఇంటర్నెట్ సస్పెండ్తో సహా లోయ అంతటా భద్రతా సంస్థలు ఆంక్షలు విధించాయి, కర్ఫ్యూ విధించబడుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఆయన అభీష్టం మేరకు శ్రీనగర్ లోని అమరవీరుల స్మశాన వాటికలో అతనిని ఖననం చేస్తామని పాకిస్థాన్ కు చెందిన గిలానీ ప్రతినిధి అబ్దుల్లా గిలానీ ప్రకటించారు. అయితే అందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనబడటం లేదు.ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ వచ్చాడు. కాశ్మీర్ సమస్యకు ఇస్లామాబాద్ సాంప్రదాయకంగా అనుసరిస్తున్న వైఖరికి భిన్నంగా పర్వేజ్ ముషారఫ్ నాలుగు అంశాల సూత్రాన్ని ప్రతిపాదించినపుడు వ్యతిరేకించిన ఏకైక వేర్పాటువాద నాయకుడు.
కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సాయుధ పోరాటానికి తీవ్రమైన మద్దతుదారుడు జిలాని, 1993 లో హురియత్ కాన్ఫరెన్స్ ఏర్పడినప్పుడు ఏడుగురు కార్యనిర్వాహక సభ్యులలో జిలానీ ఉన్నారు. అయితే కశ్మీర్పై తీవ్రవాదానికి, అస్థిరమైన భావజాలానికి ఆయన మద్దతు పలుకుతూ ఉండడంతో వారిలో తీవ్రమైన విబేధాలు ఏర్పడ్డాయి. చివరకు 2003లో విభజనకు గురయింది.
2004 లో, గీలానీ జమాత్-ఇ-ఇస్లామి ఉగ్రవాదానికి దూరమైనప్పుడు దాని నుండి విడిపోయి, తెహ్రీక్-ఇ-హురియత్ అనే సొంత రాజకీయ సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. గత రెండేళ్లుగా జిలానీ మంచంకి పరిమితమై, ఎవ్వరికీ అందుబాటులో లేకుండా ఉన్నాడు. అయితే గత సంవత్సరం జూన్ 30 న తాను స్థాపించిన హురియత్ నుండి నిష్క్రమిస్తూ అందరికి ఆశ్చర్యం కలిగించాడు.
ప్రజల ఆకాంక్షల మేరకు కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని తాను కోరుకుంటున్నానని గీలాని చెప్పినప్పటికీ, అతను పాకిస్తాన్లో విలీనానికి తీవ్రమైన మద్దతుదారుడు. గత సంవత్సరం, పాకిస్తాన్ ప్రభుత్వం అతనికి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన నిషన్-ఇ-పాకిస్తాన్ను ప్రదానం చేసింది.
ఉగ్రవాద నిధుల కేసులో హురియత్తో సహా 18 మంది వేర్పాటువాద నాయకులను ఇప్పటి వరకు కశ్మీర్ నుండి అరెస్టు చేసిన ఎన్ఐఏ లోయలో అశాంతిని రేకెత్తించడానికి వారు పాకిస్తాన్ నుండి నిధులు అందుకున్నామని ఆరోపించింది. ఏజెన్సీ గీలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ను ఛార్జిషీట్లో పేర్కొంది, వారు విభజన కోసం ఒత్తిడి చేస్తున్నారని, శాంతికి ఆజ్యం పోశారని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి, 2019 లో ఎన్ఐఏ ఈ కేసులో ఉమర్ ఫరూక్, గీలాని కుమారుడు నసీం గీలాని ఇళ్లపై దాడులు జరిపింది. మార్చి 2019 లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విదేశీ మారకపు చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు చేస్తూ 10,000 డాలర్లు అక్రమంగా కలిగి ఉన్నారనే 17 ఏళ్ల పాత కేసులో గిలానీకి రూ 17.40 లక్షల జరిమానా విధించింది.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ