క్లీన్, స్మార్ట్ బ్యాంకింగ్ను వ్యవస్థీకరించేందుకు ఉద్దేశించిన సంస్కరణల ఎజెండాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ముంబైలో ప్రారంభించారు. ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ (EASE 4.0) పేరుతో ఈ ఉమ్మడి సంస్కరణల ఎజెండాను ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం రూపొందించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో నిర్మల సీతారామన్ బుధవారం ముంబైలో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల వార్షిక పని తీరును సమీక్షించామని చెప్పారు. స్వయం సమృద్ధ భారత్ ప్యాకేజీ, కోవిడ్-19 సంబంధిత ప్యాకేజీల అమలును సమీక్షించినట్లు తెలిపారు.
బ్యాంకింగ్ స్వభావం మారుతుందని, నిధుల సేకరణ మార్గాలు కూడా మారుతున్నాయని పేర్కొంటూ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్లతో తరచూ సమావేశమవుతూ పరిశ్రమల అవసరాలను గుర్తించాలని ఆర్ధిక మంత్రి బ్యాంకులకు సూచించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఆర్గనైజేషన్తో క్రమం తప్పకుండా కలుస్తూ ఉండాలని ఆమె బ్యాంకులను ఆదేశించారు. దానితో ఎగుమతిదారులు వివిధ బ్యాంకర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుందని ఆమె చెప్పారు.
“మారిన కాలంతో, ఇప్పుడు పరిశ్రమలకు బ్యాంకింగ్ రంగం బయట నుండి కూడా నిధులను సేకరించే అవకాశం ఉంది. బ్యాంకులు జైడా = వివిధ మార్గాల ద్వారా నిధులను సేకరిస్తున్నాయి. క్రెడిట్ని అవసరమైన చోట టార్గెట్ చేయడానికి ఈ కొత్త అంశాలను అధ్యయనం చేయాలి “అని సీతారామన్ సూచించారు.
ఫిన్టెక్ రంగం వంటి నూతనంగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు బ్యాంకుల నుండి మద్దతు అవసరమని ఆర్థిక మంత్రి చెప్పారు. “పన్ను పరిపాలన నుండి అధికారులు ఇచ్చిన ఇన్పుట్ల నుండి, నూతనంగా అభివృద్ధి చెందుతున్న రంగాల ప్రత్యేక అవసరాలను బ్యాంకులు అర్థం చేసుకోవాలని తేలింది. ఉదా. ఫిన్టెక్, అలాంటి ఒక రంగం బ్యాంకులకు సాంకేతిక సహాయాన్ని అందించగలదు. అలాగే బ్యాంకింగ్ రంగం నుండి సహాయం పొందవచ్చు, ” అని ఆమె చెప్పారు.
కరోనా సమయంలో బ్యాంకుల అనితీరు భేష్
ఉద్దీపన వేగానికి అనుగుణంగా ప్రతి జిల్లాలోనూ రుణ వితరణ కృషిని బ్యాంకులు చేపడతాయని ఆమె చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో కస్టమర్ల అవసరాలు ఉన్నప్పటికీ, బ్యాంకుల విలీన ప్రక్రియకు ఎటువంటి విఘాతం కలగలేదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) సమష్టిగా చాలా బాగా పని చేస్తున్నాయని ఆమె కొనియాడారు.
మార్కెట్కు రాగలమని, నిదులను సేకరించగలమని ఈ బ్యాంకులు నిరూపించాయని ఆమె చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ఓ ప్రణాళికను రూపొందించాలని పీఎస్బీలను ఆమె కోరారు. ఈశాన్య రాష్ట్రాల లాజిస్టిక్స్, ఎగుమతుల అవసరాలను ప్రత్యేకంగా చూడాలని ఆమె చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లుగా, ఈశాన్య రాష్ట్రాల్లోని ఆర్గానిక్ పండ్ల రంగం డిమాండ్కు తగినట్లుగా బ్యాంకులు వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అనే తెలిపారు.
‘ఒక జిల్లా-ఒక ఎగుమతి’ ఎజెండాను అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని బ్యాంకులను కోరినట్లు అనే తెలిపారు. బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కరంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ) డిపాజిట్లు పెరిగిపోతున్నాయని ఆర్ధిక మంత్రి చెప్పారు. ఈ ప్రాంతాల్లో వ్యాపారాభివృద్ధికి రుణాలు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకులను ఆమె కోరారు.
More Stories
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా