మాజీ పోలీసు క‌మిష‌న‌ర్‌కు లుకౌట్ నోటీసులు

ముంబై మాజీ పోలీసు క‌మిష‌న‌ర్ ప‌ర‌మ్ బీర్ సింగ్‌ కు థానే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అక్ర‌మ వ‌సూళ్ల కేసులో ఆయ‌న‌కు ఆ నోటీసులు ఇచ్చారు. ప‌ర‌మ్ బీర్‌తో పాటు ఈ కేసుతో లింకు ఉన్న మ‌రో 27 మందికి నోటీసులు జారీ చేయ‌నున్న‌ట్లు పోలీసులు చెప్పారు.
డిప్యూటీ క‌మిష‌న‌ర్ నేతృత్వంలో ఏర్ప‌డిన సిట్ బృందం ఈ కేసును ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ది. లుకౌట్ నోటీసులు ఇచ్చే ప్ర‌క్రియ గ‌త వార‌మే ముగిసింద‌ని, ప్ర‌స్తుతం సింగ్ నోటీసు అయిపోయింద‌ని, ఇత‌రుల నోటీసుల‌ను రూపొందిస్తున్నామ‌ని థానే పోలీసు క‌మిష‌న‌రేట్ పేర్కొన్న‌ది.
అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని, ప్ర‌తి ఒక‌రి వాంగ్మూలం తీసుకుంటున్న‌ట్లు క‌మిష‌న‌రేట్ చెప్పింది. ముంబై మాజీ పోలీసు క‌మీష‌న‌ర్ ప‌ర‌మ్ బీర్‌తో పాటు 27 మందిపై అక్ర‌మ వ‌సూళ్ల కేసు బుక్ అయిన విష‌యం తెలిసిందే. దీంట్లో ఉన్న‌త స్థాయి పోలీసులు, అండ‌ర్ వ‌ర‌ల్డ్ గ్యాంగ్‌స్ట‌ర్స్‌, జ‌ర్న‌లిస్టులు కూడా ఉన్న థాన్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు న‌మోదు అయ్యింది.