ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా చేయనున్న మహిళా మోర్చా కార్యకర్తల ధర్నాను పోలీసులు అడ్డుకోవడం రాజ్యాంగ వ్యతిరేకం. హక్కులను కాలరాయడమేఅని గీతా మూర్తి విమర్శించారు. పోలీసుల, ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించి మహిళా మోర్చా కార్యకర్తలు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గీతా మూర్తి మాట్లాడుతూ పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో తమపట్ల అమర్యాదగా ప్రవర్తించడం ప్రభుత్వ నిర్దేశాలు తోనే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. నిరసన తెలియజేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తున్నదని నిరసన ప్రదర్శనలు ఆపేయాలని అనుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు.
ఇప్పటికీ వైద్యశాలలో నర్సుల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్యశాలలో ఇప్పటికే ఉన్న నర్సులపైనా పని భారం చాలా ఉంది. వైద్య విధానం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదు అనడానికి, అనారోగ్యంతో బాధపడుతున్న పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కు కనికరం లేదనడానికి ఈ నర్సుల తొలగింపు ఒక నిదర్శనం అని ఆమె విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు నిరుద్యోగులకు భృతి ఇస్తామని మోసం చేసి ఇప్పటికీ నిరుద్యోగభృతి కల్పించడం లేదు. కరోనా సమయంలో పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. నర్సు ఉద్యోగాలను ఖాళీగా ఉన్నాయని నర్సులను తీసుకొని నేడు వాళ్ళని తొలగించడం అసంబద్ధమైనది. తొలగించిన నర్సులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని మహిళా మోర్చా రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది.
More Stories
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన