ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే కాని ఆయన ఎంపీగానే కొనసాగుతున్నారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వారు ఆరు నెలల లోపు రాష్ట్ర అసెంబ్లీ లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్కు శాసన మండలి లేదు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీరథ్కు సెప్టెంబర్ 10 వరకు గడువు ఉన్నది.
రాష్ట్రంలోని గంగోత్రి, హల్ద్వానీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. అయితే కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించడంపై ఈసీ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు చాలా తక్కువ. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151ఏ ప్రకారం లోక్సభ, శాసన సభ స్థానాలు ఖాళీ అయినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించాలి. అయితే కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవీ కాలం కనీసం ఒక సంవత్సరం ఉండాలి.
కానీ ఉత్తరాఖండ్ శాసన సభ పదవీ కాలం సుమారు తొమ్మిది నెలలే మిగిలింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించే చట్టం ఏదీ లేదని, అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలను నిర్వహించాలనుకుంటే నిరోధించే నిబంధనలు కూడా లేవని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో నెలకొన్న ఈ అనిశ్చితిని తొలగించేందుకు కొత్త సీఎంను నియమించాలని బీజేపీ యోచిస్తున్నది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బుధవారం రాత్రి భేటీ అయిన ఆయన.. శుక్రవారం మరోసారి నడ్డాను కలిశారు.
ఈ నేపథ్యంలో.. ప్రజాప్రతినిధుల చట్టం-1951 ప్రకారం ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితి లేనందున.. రాజీనామా చేయాలని నడ్డా ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రావత్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన రాజీనామా లేఖను ఇచ్చినట్లు తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రెండు పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. వీరిద్దరూ సీనియర్ నాయకులే. ఒకరు సత్పాల్ సింగ్, రెండో పేరు ధన్సింగ్ రావత్.
More Stories
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన
ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు