భారత్కు నెత్తిమీద అన్నట్లుగా టిబెట్లో చైనా తన తొలి బుల్లెట్ ట్రైన్ను శుక్రవారం ఆరంభించింది. అట్లాగే తొలి పూర్తిస్థాయి విద్యుత్ రైలు కూడా మార్గం కూడా ఇదే కావడం గమనార్హం.
అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలోనే, మారుమూల హిమాలయ శ్రేణువుల మధ్య ఈ పూర్తి స్థాయి ఎలక్ట్రికల్ బుల్లెట్ రైలు దూసుకుపోతుంది. అత్యంత వ్యూహాత్మకంగానే చైనా అరుణాచల్కు అత్యంత సమీపంలో నుంచి ఈ బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా మార్గాన్ని ఎంచుకుంది.
చైనా ప్రాంతీయ రాజధాని లాహ్సాకు, టిబెట్లోని న్యింగ్చికి కలుపుతూ ఈ రైలు మార్గం ఏర్పడింది. ఇది సిచ్యూవాన్ టిబెట్ రైల్వేకు చెందిన లాహ్సా న్యింగ్చి సెక్షన్లో ఏకంగా 435 .5 కిలోమీటర్ల పొడవునా ఈ బుల్లెట్ ట్రైన్ విస్తరించుకుని పోతుంది.
అరుణాచల్ ప్రదేశ్ తమదే అని చైనా తరచూ వాదిస్తూ భారత ప్రాదేశిక సర్వసత్తాకతకు తరచూ సవాలు విసురుతూ వస్తోంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఈ వాదనకు విలువ లేకుండా పోయింది. దీనితో ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకే చైనా తన బుల్లెట్ ట్రైన్ను ఇక్కడ ప్రవేశపెట్టిందని భావిస్తున్నారు.
చైనా అధ్యక్షులు జి జిన్పింగ్ వ్యక్తిగత ఆదేశాలతో ఆసక్తి కనబర్చడం వల్లనే ఈ బుల్లెట్ ట్రైన్ అత్యంత తక్కువ కాలంలోనే రూపుదిద్దుకుంది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ ట్రైన్ను చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) శతజయంతి జులై 1న జరిగే నేపథ్యంలోనే ఆరంభించారు. ఈ ట్రైన్కు ఫ్యూక్సింగ్ అని పేరుపెట్టినట్లు అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది.
సింగిల్ లైన్పై వేళ్లే ఈ రైలు తొమ్మిది స్టేషన్లలో ఆగుతుంది. దీనిని ప్రయాణికులకు, సరుకు రవాణాకు వినియోగిస్తారు. ఈ రైలు మార్గం వెంబడి అత్యధిక సంఖ్యలో టన్నెల్స్, బ్రిడ్జిలు ఉంటాయి. టిబెట్ సింధుశాఖ ప్రాంతంలో వెళ్లే ఈ రైలు బ్రహ్మపుత్ర నదికి సమీపంలో నుంచి వెళ్లుతుంది.
ఈ రైలు మార్గం నిర్మాణ పనులను 2014లోనే చైనా మొదలు పెట్టింది. ఆ ప్రాంతంలో చైనా ప్రారంభించిన రెండో రైల్వే లైన్ ఇది. ఈ రైలు మార్గంతో సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూ నుంచి లాసా మధ్య ప్రయాణ సమయం 48 గంటల నుంచి 13 గంటలకు తగ్గనుందని చైనా అధికారిక మీడియా తెలిపింది.
కాగా, సరిహద్దుల్లో స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఈ రైలు మార్గం కీలక పాత్ర పోషిస్తుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గతంలో పేర్కొన్నారు. అభివృద్ధి పనుల ముసుగులో సరిహద్దుల్లోకి తమ బలగాలను వేగంగా తరలించేందుకే చైనా ఈ రైలు మార్గాన్ని నెలకొల్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
More Stories
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన
ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు