ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా, పొలిటికల్ ఎడిటర్, నేషనల్ బ్యూరో చీఫ్, రవిష్ తివారిలతో జరిగిన గోష్టిలో ఆయన పలు అంశాలపై స్పందించారు. కోవిడ్ -19, ‘లవ్ జిహాద్’, 2022 రాష్ట్ర ఎన్నికలతో సహా పలు అంశాలపై మాట్లాడారు.
కోవిడ్ -19 రెండవ వేవ్ మధ్య పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు.‘లవ్ జిహాద్’ సందర్భంగా 2009 లో కేరళ హైకోర్టు ఈ పదాన్ని ప్రస్తావించిందని సిఎం గుర్తు చేశారు. “తరువాత, కర్ణాటక హైకోర్టు కూడా దానిపై ఒక ఉత్తర్వు జారీ చేసింది. పిల్లలు, మహిళలను లక్ష్యంగా చేసుకున్నఇద్దరినీ మేము ఇటీవల అరెస్టు చేసాము… రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 100 కేసులు కనిపించాయి, ”అని ఆయన వివరించారు. ఈ చట్టం ప్రజలందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 3-4 సంవత్సరాలు ఎటువంటి సమస్య లేకుండా పనిచేశామని, అయితే మార్చి 2020 తరువాత, కోవిడ్ -19 రాష్ట్ర పురోగతికి ఆటంకం కలిగించిందని ఈ సమయంలో కోవిద్ కట్టడి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘టెస్ట్, ట్రాక్ అండ్ ట్రీట్’ అనే మంత్రంతో ఎప్పుడు తగు మార్గదర్శనం చేస్తున్నారని చెప్పారు.
సులభతరం వాణిజ్యం జాబితాలో 16వ స్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ ఇప్పుటు 2వ స్థానంలోకి వచ్చినదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.“జూన్ 21 న 7.25 లక్షల టీకాలు వేయడం వెనుక యుపి గత 24 గంటల్లో 8.1 లక్షల మందికి టీకాలు వేసింది. ఈ కార్యక్రమం ఉపందుకొంది. గుడ్ గోయింగ్ సిఎం ”అని ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ సంతోష్ ట్వీట్ చేశారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిబు కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య వంటి సీనియర్ పార్టీ నాయకులు కొందరు చెబుతున్న తరుణంలో ఆదిత్యనాథ్ పట్ల సంతోష్ ప్రశంసలు కురిపించడం ప్రాధ్యానత సంతరింప చేసుకొంది.
మంగళవారం పార్టీ నాయకులు, మంత్రులతో తన సమావేశంలో నాయకులను ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ అవగాహనతో పనిచేసే విధంగా చూడడం కోసం తగు మార్గదర్శనం చేసిన్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. సంతోష్తో పాటు లక్నో వచ్చిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు, యుపి ఇన్ఛార్జి రాధా మోహన్ సింగ్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. జూన్ 23 నుండి జూలై 6 వరకు జరగబోయే వివిధ కార్యక్రమాల్లో భాగంగా బూత్ స్థాయి సమావేశం జరిగినట్లు పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ మరణ వార్షికోత్సవం జూన్ 23 నుండి, ఆయన జయంతి జూలై 6 వరకు సమగ్ర తోటల కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు యుపి బిజెపి తెలిపింది. 1975 లో దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రోజు జూన్ 25 న పార్టీ వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది.
మరోవంక, యూపీలో నాయకత్వ మార్పు ఊహాగానాలకు బీజేపీ తెరదించింది. యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోనే కాషాయపార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ స్పష్టం చేశారు. ఇక యోగి ఆదిత్యానాధ్ యూపీ అభ్యున్నతికి విశేషంగా శ్రమిస్తున్నారని ఆయనను మార్చాల్సిన అవసరం ఏముందని సింగ్ ప్రశ్నించారు.
More Stories
ఇరాన్పై క్షిపణులతో ఇజ్రాయిల్ ప్రతీకార దాడి
భారత నేవీ చీఫ్గా దినేష్ త్రిపాఠి
మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం