
ఇవాళ జరిగిన భేటీలో మరాఠా రిజర్వేషన్లు, మెట్రో కారు షెడ్, జీఎస్టీ పన్ను వసూళ్ల పరిహరం గురించి ప్రధానితో చర్చించినట్లు సీఎం ఉద్దవ్ తెలిపారు. మరాఠా రిజర్వేషన్పై ఉన్న 50 శాతం సీలింగ్ను ఎత్తివేయాలని ప్రధానిని కోరారు. మరాఠా భాషకు ప్రాచీన హోదా ఇవ్వాలన్న డిమాండ్ కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని సీఎం చెప్పారు.
ఈ అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. తాము ప్రస్తావించిన అంశాలను ఓపికగా విన్న ప్రధాని వాటిపై సానుకూలంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉద్ధవ్ తెలిపారు.
మహారాష్ట్రలో 18 నుంచి 44 ఏళ్ల గ్రూపులో ఆరు కోట్ల మంది ఉన్నారని, వారికి రెండు సార్లు కోవిడ్ టీకాలు ఇవ్వాలంటే 12 కోట్ల డోసులు అవసరం అవుతుందని ఉద్దవ్ తెలిపారు. “అందరికీ ఇవ్వాలని ప్రయత్నించాం, కానీ సరిపడా సరఫరా లేక ఆగిపోయింది” అని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ను కేంద్రీకృతం చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే భారత్ లో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేట్ అవుతారని సీఎం ఉద్దవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
More Stories
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
శ్రీహరికోటలోని షార్లో తీవ్రవాదులంటూ బెదిరింపు
దేశవ్యాప్తంగా రెండు దఫాల్లో జమిలి ఎన్నికల ప్రక్రియ