ఇందులో నటించిన వ్యక్తులకు గానీ, వెబ్ సిరీస్ నిర్మాణంలో భాగమైన వారికి గానీ ఏ ఒక్క వ్యక్తిని, కులాన్ని, మతాన్ని, మత విశ్వాసాలను కించపరిచే ఉద్దేశం లేదని తెలిపింది. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్టు ‘తాండవ్’ యూనిట్ ప్రకటించింది.
అయితే.. ఈ వెబ్ సిరీస్ నుంచి హిందూ దేవుళ్లను, దేవతలను కించపరిచే సన్నివేశాలను ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందేనని పలువురు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోను దీనిపై మండిపడుతున్నారు. ‘తాండవ్’లో హిందూ దేవుళ్లను కించపరిచారని బీజేపీ ఎమ్మెల్యే రామ్కదమ్ ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్నోలోను ఈ వెబ్ సిరీస్పై కేసు నమోదైంది.
అయితే క్షమాపణలు చెప్పినప్పటికీ బీజేపీ శాంతించడం లేదు. వచ్చే మూడు రోజులలో అమెజాన్కు వ్యతిరేఖంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నిరసనలు చేస్తాం అంటూ బీజేపీ నాయకుడు రామ్ కదమ్ అన్నారు.
తాండవ్ యూనిట్ అందరిని జైలుకు పంపకపోతే అమెజాన్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయాలంటూ ప్రచారం చేస్తాము. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం హిందువుల మనోభావాలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోతే మేము మా నిరసనను మరింత ముమ్మరం చేస్తాము. అమెజాన్కు , తాండవ్ ఫిలిం మేకర్స్కు వ్యతిరేఖంగా రానున్న రోజులలో మా నిరసనను ఉదృతం చేస్తాము అంటూ బిజెపి మీడియా యూనిట్ అధిపతి విశ్వస్ పాథక్ అన్నారు.
పోలీటికల్ డ్రామా వెబ్ సిరీస్ను దర్శకుడు అలీ అబ్బాస్ రూపొందించగా, హిమాన్షు కిశన్ మెహ్రాతో కలిసి నిర్మించారు. ఇందులో డింపుల్ కపాడియా, సునీల్ గ్రోవర్, తిగ్మన్షు ధులియా, గౌహర్ ఖాన్లు ప్రధాన పాత్రల్లో నటించారు.
More Stories
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన