
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు ఎందుకు చేస్తున్నారో రైతులకే తెలియదని బీజేపీ ఎంపీ హేమా మాలిని విచయం వ్యక్తం చేశారు. ఈ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడాన్ని ఆమె స్వాగతించారు. దీని వల్ల ఉద్రిక్తతలు కాస్త తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్లో రైతులు టవర్లను కూల్చడం సరికాదని హితవు చెప్పారు.
‘వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడం శుభపరిణామం. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులు తగ్గడానికి దోహదపడొచ్చు. పలు దఫాల చర్చలు జరిగిన తర్వాత కూడా రైతులు ఓ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అసలు తమకేం కావాలో అన్నదాతలకు స్పష్టత లేదు’ అని ఆమె తెలిపారు.
కొత్త చట్టాలతో వచ్చే సమస్య ఏంటనేది కూడా వారికి స్పష్టత లేదని అంటూ ఎవరో చెప్పడం వల్లే రైతులు నిరసనలు చేస్తున్నారని ఆమె చెప్పారు. ఈ ఆందోళనలతో పంజాబ్ తీవ్రంగా నష్టపోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
పంజాబ్ లో రైతులు టవర్లను కూల్చేవేయడాన్ని ప్రస్తావిస్తూ అన్నదాతలు అలా చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం పలుమార్లు చర్చలకు పిలిచినప్పటికీ రైతులకు ఓ ఎజెండా అనేది లేకుండా పోయిందని ఆమె విచారం వ్యక్తం చేశారు. అందుకే చర్చలు విఫలమయ్యాయని హేమా మాలిని తెలిపారు.
More Stories
ఎనిమిదేళ్లలో రూ.2.53 లక్షల కోట్ల రక్షణ సామగ్రి
107 మంది ఎమ్మెల్యేలు, ఎంపిలపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు
న్యాయవ్యవస్ధపై చేసిన వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ క్షమాపణ