కోవిడ్-19 వ్యాక్సిన్ భారతీయులందరికీ ఉచితంగానే పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ శనివారం వెల్లడించారు. ఢిల్లీలోని దరియాగంజ్లో మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో వ్యాక్సినేషన్ డ్రై రన్ తీరును సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ను ఉచితంగా ఇస్తామని తెలిపారు.
ఢిల్లీలో మాదిరిగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్ను ఉచితంగా పంపిణీ చేస్తారా? అని విలేకర్లు అడిగినపుడు డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, ఢిల్లీలోనే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉచితమేనని చెప్పారు. అంతకుముందు ఆయన గురు తేజ్ బహదూర్ హాస్పిటల్లో డ్రై రన్ను సమీక్షించారు.
ఢిల్లీలో మొత్తం మూడు చోట్ల డ్రై రన్ నిర్వహిస్తున్నారు. గురు తేజ్ బహదూర్ హాస్పిటల్, మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్, వేంకటేశ్వర హాస్పిటల్లలో డ్రై రన్ నిర్వహిస్తున్నారు.
డ్రై రన్లో వ్యాక్సిన్ను ఇవ్వడం మినహా మిగతా కార్యకలాపాలను నిర్వహిస్తారు. వ్యాక్సిన్ తీసుకునేవారి పేరు నమోదు చేయడం, వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి విశ్రాంతి కల్పించడం, ఆ వ్యక్తికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలి? వంటివాటిని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తారు.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధిపరచిన వ్యాక్సిన్ను నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం పంపించారు. త్వరలోనే ఈ సిఫారసులపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఫారసులు వస్తాయని హర్షవర్ధన్ చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వ్యాక్సినేషన్ జనవరి 6 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
కాగా, దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం డ్రై రన్ జరుగుతోందని, వదంతులను ఎవరూ నమ్మవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోరారు. ప్రజలకు భద్రతతోపాటు వ్యాక్సిన్ విజయవంతం కావడానికి ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు.
పోలియో ఇమ్యునైజేన్ జరిగేటపుడు కూడా అనేక రకాల వదంతులు ప్రచారమయ్యాయని, అయితే ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారని, ఇప్పుడు భారత దేశం పోలియో నుంచి విముక్తి పొందిందని తెలిపారు. వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతున్న ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ హాస్పిటల్ను హర్షవర్ధన్ శనివారం సందర్శించారు. ఈ ఆసుపత్రితోపాటు దరియాగంజ్ ప్రైమరీ హెల్త్ సెంటర్, వేంకటేశ్వర హాస్పిటల్లో కూడా డ్రై రన్ జరుగుతోంది.
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన డ్రై రన్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించామని, ఆ సమాచారం ఆధారంగా నూతన మార్గదర్శకాలను రూపొందించామని హర్షవర్దన్ చెప్పారు. నూతన మార్గదర్శకాల ప్రకారమే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శనివారం డ్రై రన్ జరుగుతుందని తెలిపారు.
More Stories
వయనాడ్ నుంచి ప్రజలు రాహుల్ ను తరిమికొడతారు
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
త్వరలో భారత్లోకి ఎయిర్ట్యాక్సీలు