కోవిద్ నిబంధనలు ఉపక్రమించి నిర్వహిస్తున్నారన్న ఆరోపణపై ముంబైలోని ఓ పబ్పై పోలీసులు సోమవారం రాత్రి జరిపిన దాడిలో మాజీ క్రికెటర్ సురేష్ రైనాతో సహా 34 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వారిలో రైనాతో పాటు సింగర్ గురు రాంధ్వా, హార్దిక్ రోషన్ మాజీ భార్య సుశేన్ ఖాన్ కూడా ఉన్నారు.
ముంబై విమానాశ్రయం సమీపంలో ఉన్న సహర్ ప్రాంతంలో ఆ పబ్ ఉన్నది. నిర్ణీత సమయం దాటి పబ్ను ఓపెన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మాస్క్లు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించకపోవడం లాంటి ఉల్లంఘనలకు కూడా పాల్పడ్డారు. ప్రస్తుతం ముంబైలో రాత్రి 11.30 వరకే పబ్లకు తెరిచే అనుమతి ఉన్నది.
కానీ సహర్ ప్రాంతంలోని పబ్ తెల్లవారుజామున 4 గంటలకు కూడా తెరిచి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2.50 నిమిషాలకు ముంబై పోలీసు శాఖకు చెందిన స్పెషల్ స్వ్కాడ్ ఆ పబ్పై తనిఖీ నిర్వహించారు. తాజాగా కరోనా నిబంధనల నేపథ్యంలో రాత్రి పూట 11 నుంచి ఉదయం 6 వరకు మహారాష్ట్రలో కర్ఫ్యూ విధించారు. అయితే ఆ ఆంక్షలను పబ్ నిర్వాహాకులు అతిక్రమించినట్లు పోలీసులు చెప్పారు.
సురేశ్ రైనాను ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశారు. అంధేరీలోని హోటల్ జేడబ్ల్యూ మారియట్లో ఆ పబ్ ఉన్నది. జనవరి 10వ తేదీ నుంచి జరగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం రైనా యూపీ జట్టు తరపున ఆడనున్నాడు.
More Stories
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు