హైకోర్టు విధించిన నిషేధంపై స్టే ఇవ్వాలని కోరింది. దీంతో బాణాసంచా వ్యాపారులకు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. బాణసంచా నిషేధంపై హైకోర్టు ఉత్తర్వులను సవరించింది. దీపావళి రోజు మాత్రమే రెండు గంటలపాటు బాణసంచా కాల్చేందుకు అనుమతినిచ్చింది. రెండు గంటలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలని ఎన్జీటీ సూచించింది.
అంతకు ముందు తెలంగాణలో బాణాసంచా నిషేధించాలంటూ న్యాయవాది ఇంద్రప్రకాశ్ పిల్ వేయడంతో షాపులను మూసివేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ బాణాసంచా నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా పేల్చవద్దని హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ ప్రభుత్వం జీవో-1777 జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వం జీవోపై క్రాకర్స్ షాపు యజమానులు, అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకించారు. టపాసులు బ్యాన్ చేస్తే కోట్లల్లో నష్టపోతామంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
More Stories
బిజెపి రేజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు
బీజేపీతోనే గిరిజన, దళితులకు గౌరవం
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు