వ్యవసాయ బిల్లుతో దశాబ్దాల పాపాలు పోతాయి

ఈ వ్యవసాయ బిల్లు వల్ల దశాబ్దాల  పాపాలు పోతాయి, రైతుల పరంగా చూస్తే నిజంగా వరం లాంటిది..రైతే రాజు అవుతాడు అని బీజేపీ ఎంపీ డి అరవింద్ కొనియాడారు. అందుకే బిల్లుని చూసి కేసీఆర్ ఉల్లిక్కిపడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. 

ఒక పక్క ఇప్పటికి రైతులు మద్దతు ధర కోసం రోడ్లు ఎక్కుతున్నారని,  60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకి అన్యాయం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టింది.. గాంధీ కుటుంబ అసబద్దమైన రాజకీయాల వల్ల ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసని ధ్వజమెత్తారు.

ఈ బిల్లు వల్ల రైతు పంట ఎక్కడ ఎప్పుడు అమ్ముకోవాలో రైతు నిర్ణయించుకోవచ్చని త్లెఇపారు. బిల్లు వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతూ ఈ బిల్లు వల్ల రైతు అమ్మిన వస్తువుకి అదే రోజు డబ్బులు ఇవ్వాలని స్పష్టం చేశారు. రైతు దేశంలో ఏ రాష్ట్రంలో అయిన పంట అమ్ముకోవచ్చని అంటూ రాష్ట్రాలు కూడా రైతులపై పన్ను వేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.

మోడీకి, కేసీఆర్ కి చాలా వ్యత్యాసం ఉందని చెబుతూ  కేశవరావు మస్క కొట్టుకుంటూ టిఆర్ఎస్ లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. 0 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందుకు ఇలా దిగజరిపోతున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ మార్కెట్ యార్డులతో కుమ్మక్కవుతున్నాడని విమర్శించారు. 

మార్కెట్ యార్డులో చాలా అవినీతి ఉందని చెబుతూ తమ వాటా తగ్గుతుందని కేసీఆర్ భయపడుతున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణలో కల్వకుంట్ల టాక్స్ ఉందని ప్రజలకు తెలియాలని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.  రాష్ట్రంలో పనికిమాలిన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అని చెబుతూ ఇది  ఫ్రెండ్లీ ప్రతిపక్షం అని ఎంపీ అరవింద్ విమర్శించారు.

కాగా, వ్యవసాయ బిల్లును ప్రాంతీయ పార్టీలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయో తెలియడం లేదని, కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు లబ్ది చేకూరుతుందని మరో బీజేపీ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. 

ఈ బిల్లుతో దళారీ వ్యవస్థ పూర్తిగా పోతుందని, రైతు ఎలాంటి నష్టం లేకుండా పంటను అమ్ముకోవచ్చని భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఈ దళారిల వ్యవస్థ ఎక్కువగా ఉందని పేర్కొంటూ ఈ దళారీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులేనని ఆయన విమర్శించారు.