కాగా, ఒడిశాలోని ఫతేగఢ్ గ్రామంలో రామ మందిరం నిర్మాణం వెనుక కూడా చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇక్కడి పర్వతంపై కొలువైన గోవర్ధనుడు దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్నాడు. 1912లో జగన్నాథుడి నవకళేబర్ కోసం సుదర్శన్ చెట్టును ఫతేగఢ్ నుంచి సేకరించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రామాలయాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు చొరవ చూపారు.
శ్రీరామ సేవా పరిషత్ పేరుతో కమిటీని ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్త, భాపూర్ బ్లాక్ వైస్ చైర్ పర్సన్ ఈ కమిటీ అధ్యక్షునిగా నియమితులైన తర్వాత ఆలయ నిర్మాణం పనులు ప్రారంభించారు. మరోవైపు ఈ నెల 22న ఒడిశాలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజా క్రతువులు ఒక రోజు ముందుగానే మొదలు కానున్నాయి.
ఆలయ ప్రారంభ మహోత్సవానికి హాజరు కావాలని పూరీ శంకరాచార్య, మహారాజులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయంతోపాటు వివిధ ఆలయాల పూజారులు, అధికారులు, పలువురు ప్రముఖులను కూడా రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.
More Stories
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్
కోవాగ్జిన్ తీసుకున్న 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు
చార్ధామ్ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి