2008 జులై 31:- సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న గౌతమి ఎక్స్ప్రెస్కు మంటలు అంటుకున్నాయి. కేసముద్రం- తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్లకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగు బోగీలు పూర్తిగా దహనమైపోయాయి. 32మంది అగ్నికి ఆహుతయ్యారు.
2011 జులై 7:- ఉత్తర్ ప్రదేశ్ ఈటాహ్కు సమీపంలో ఛప్రా- మథురా ఎక్స్ప్రెస్ ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 69మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. రైలు హైస్పీడ్లో వస్తున్న సమయంలోనే పట్టాలను దాటేందుకు బస్సు ప్రయాణించడంతో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరకిలోమీటర్ వరకు బస్సును ఈడ్చుకెళ్లింది రైలు.
భారతీయ రైల్వేల చరిత్రలో 2012 ఏడాదిని అతి ఘోరమైన సంవత్సరంగా భావిస్తుంటారు. ఒక్క ఏడాదిలో 14కుపైగా ప్రమాదాలు జరిగాయి. రైళ్లు పట్టాలు తప్పడాలు, రైళ్లు పరస్పరం ఢీకొనడాలు తరచుగా వార్తలకెక్కేవి.
2012 జులై 30:- నెల్లూరుకు సమీపంలో ఢిల్లీ- చెన్నై తమిళనాడు ఎక్స్ప్రెస్కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 30మంది మరణించారు.
2014 మే 26:- ఉత్తర్ ప్రదేశ్ సంత్ కబీర్ నగర్ ప్రాంతంలోని ఖలలాబాద్ స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును గోరఖ్పూర్ వెళుతున్న గోరఖ్ధామ్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25మంది మరణించారు. 50మంది గాయపడ్డారు.
2015 మార్చ్ 20:- డెహ్రాడూన్ నుంచి వారణాసి వెళుతున్న జనతా ఎక్స్ప్రెస్.. ఉత్తర్ ప్రదేశ్ రాయ్బరేలీలోని బచ్రవాన్ రైల్వే స్టేషన్కు సమీపంలో పట్టాలు తప్పింది. ఇంజిన్తో పాటు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 30మంది మరణించారు. 150మంది గాయపడ్డారు.
2016 నవంబర్ 20:- కాన్పూర్లోని పుఖ్రాయన్కు సమీపంలో ఇండోర్- పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 150మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 150మంది గాయపడ్డారు.
2017 ఆగస్ట్ 19:- హరిద్వార్ నుంచి పూరి వెళుతున్న కలింగ ఉత్కల్ ఎక్స్ప్రెస్.. ఉత్తర్ ప్రదేశ్ ముజాఫర్నగర్లో ప్రమాదానికి గురైంది. 14 బోగీలు పట్టాలు తప్పాయి. 21మంది మరణించారు. 97మంది గాయపడ్డారు.
2017 ఆగస్ట్ 23:- ఉత్తర్ ప్రదేశ్ ఔరియాకు సమీపంలో కైఫియత్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 70మంది గాయపడ్డారు.
2022 జనవరి 13:- బికనీర్- గౌహత ఎక్స్ప్రెస్కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. పశ్చిమ్ బెంగాల్ అలీపుర్దౌర్కు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇందులో 9మంది మరణించారు. 36మంది గాయపడ్డారు.
2023 జూన్ 2:- ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో (జూన్ 3 ఉదయం 6 గంటల వరకు) మృతుల సంఖ్య 207కు చేరింది.
1981:- బిహార్లోని సహస్ర వద్ద జరిగిన ఘటనలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి భాగమతి నదిలో మునగడంతో 500 మంది మరణించారు.
1995:- ఉత్తర్ ప్రదేశ్లోని ఫిరోజాబాద్ వద్ద దిల్లీ వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్ప్రెస్.. కలిండ్ ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 358 మంది చనిపోయారు.
1999:- అసోంలోని గైసోల్ వద్ద జరిగిన రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 290 మంది మరణించారు. ప్రమాద తీవ్రతకు పేలుడు కూడా సంభవించడటం సంచలనంగా మారింది.
1998:- కోల్కతా వెళుతున్న జమ్ముతావి ఎక్స్ప్రెస్.. ఖన్నా-లుథియానా సెక్షన్లో పట్టాలు తప్పిన.. గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 212 మంది ప్రాణాలు కోల్పోయారు.
2002:- హౌరా నుంచి దిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 140 మంది చనిపోయారు.
More Stories
తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు