
నవంబర్ 11 సాయంత్రం విశాఖపట్నంకు చేరుకొని, 12న ఉదయం 10:30 గంటలకు బహుళ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు తెలంగాణాలోని రామగుండంలో ఉన్న ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ను ప్రధాని సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4:15 గంటలకు రామగుండం వద్ద బహుళ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
రాష్ట్రంలో రూ.3,750 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న ఆరు లైన్ల గ్రీన్ఫీల్డ్ రారుపూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్లో ఏపి విభాగానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలోని గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. విశాఖపట్నంలోని కాన్వెంట్ జంక్షన్ నుండి షీలా నగర్ జంక్షన్ వరకు ప్రత్యేక పోర్ట్ రోడ్డుకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది విశాఖపట్నం నగరంలో స్థానిక, ఓడరేవుకు వెళ్లే వస్తువుల ట్రాఫిక్ను వేరు చేయడంతో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.
శ్రీకాకుళం-గజపతి కారిడార్లో భాగంగా రూ.200 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఎన్హెచ్-326ఎలోని నరసన్నపేట నుండి పాతపట్నం సెక్షన్ను కూడా ఆయన జాతికి అంకితం చేస్తారు. ప్రాజెక్ట్ ప్రాంతంలో మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ఒఎన్జిసి యు-ఫీల్డ్ ఆన్షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేస్తారు.
నేచురల్ గ్యాస్ గ్రిడ్ (ఎన్జిజి)లో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలోని వివిధ జిల్లాల్లో ఇల్లు, పరిశ్రమలు, వాణిజ్య యూనిట్లు, ఆటోమొబైల్ రంగాలకు సహజ వాయువును సరఫరా చేయడానికి పైప్లైన్ కీలకమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు ఈ పైప్లైన్ సహజ వాయువును సరఫరా చేస్తుంది.
దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్ రోజుకు 75,000 మంది ప్రయాణీకులను అందిస్తుంది. ఆధునిక సౌకర్యాలను అందించడంతో ప్రయాణీకుల అవసరాలను మెరుగుపరుస్తుంది.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, అప్గ్రేడేషన్కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.150 కోట్లు ఉంది. ఫిషింగ్ హార్బర్ అప్గ్రేడేషన్, ఆధునీకరణ తరువాత హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని రోజుకు 150 టన్నుల నుండి రోజుకు 300 టన్నులకు రెట్టింపు చేస్తుంది.
తెలంగాణాలో….
తెలంగాణలో ప్రధాని మోదీ రూ.9,500 కోట్లపైగా విలువైన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రామగుండంలో ఎరువుల ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్నారు. రామగుండం ప్లాంట్ ఏడాదికి 12.7 ఎల్ఎంటి దేశీయ వేప పూతతో కూడిన యూరియా ఉత్పత్తిని అందుబాటులోకి తెస్తుంది. రూ.6,300 కంటే ఎక్కువ పెట్టుబడితో న్యూ అమ్మోనియా-యూరియా ప్లాంట్ను ఏర్పాటు చేసే బాధ్యతను ఆర్ఎఫ్సిఎల్కు అప్పగించారు.
దాదాపు రూ.1,000 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే రూ.2,200 కోట్లకు పైగా వ్యయంతో ఎన్హెచ్-765డిజి మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్, ఎన్హెచ్-161బిబి బోధన్-బాసర్-భైంసా విభాగం, ఎన్హెచ్-353సి సిరోంచ నుండి మహదేవ్పూర్ సెక్షన్కు సంబంధించిన వివిధ రోడ్డు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
More Stories
భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర
ట్రంప్ హెచ్చరికతో బందీలను విడుదలహమాస్ అంగీకారం
అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది