తొలిసారి ఓటు హక్కు పొందినవారి సంఖ్య 1.86 లక్షలని, 80 ఏళ్ల వయసు పైబడిన ఓటర్ల సంఖ్య 1.22 లక్షలని తెలిపారు. మొత్తం ఓటర్ల సంఖ్య 55 లక్షలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన బూటకపు వార్తలు, వదంతులపై నిఘా పెట్టేందుకు సామాజిక మాధ్యమాల బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 80 ఏళ్ళ వయసు పైబడినవారు, అదేవిధంగా 40 శాతం పైబడిన అంగవైకల్యంగలవారు తమ ఇంటి వద్ద నుంచే ఓటు వేయవచ్చునని చెప్పారు.
హిమాచల్ప్రదేశ్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అక్కడ బీజేపీ నుంచి 45 మంది, కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. 2023 జనవరి 8న హిమాచల్లో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఈసీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది. అయితే 1985 నుంచి ఇప్పటివరకు హిమాచల్ప్రదేశ్లో ఏ ఒక్క పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలువలేదు.
కాగా, గుజరాత్ అసెంబ్లీ గడువు 2023 ఫిబ్రవరి 18తో ముగియనున్నందున ఈ ఏడాది చివరలోనే ఎన్నికలు నిర్వహించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో ఎన్డీఏ బలం 111కు చేరింది.
More Stories
కొత్త ప్రభుత్వానికి 100 రోజుల మాస్టర్ ప్లాన్!
లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ నేడే
మోదీ వారణాసిలో రేపే నామినేషన్.. ఘనంగా రోడ్ షో