బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో `మర్యాదపూర్వకం’గా విడివిడిగా కలిసారని భావిస్తున్న ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, ప్రముఖ బాలీవుడ్ నటుడు నితిన్ వచ్చే ఎన్నికలలో బిజెపి తరపున ప్రచారం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయాన్నీ బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె లక్ష్మణ్ స్వయంగా వెల్లడించారు.
వారు మర్యాద పూర్వకంగా కలసిన్నట్లు తొలుత బిజెపి వర్గాలు చెప్పినప్పటికీ, వారి సంభాషణలలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు డా. లక్ష్మణ్ తెలిపారు. అంతేకాదు, గత వారం హైదరాబాద్ లో కేంద్ర హోమ్ మంత్రి హోమ్ షాను ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలసినప్పుడు కూడా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు డా. లక్ష్మణ్ చెప్పడం గమనార్హం.
ఇప్పటివరకు అమిత్ షా, ఎన్టీఆర్ ల మధ్య కేవలం సినిమాలకు సంబంధించిన అంశాలే చర్చకు వచ్చిన్నట్లు చెబుతూ వచ్చారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బిజెపి కేంద్ర నాయకత్వం వ్యూహాత్మకంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.
పైగా, నితిన్, మిథాలీ రాజ్ త్వరలో ప్రదాని నరేంద్ర మోదీని కూడా కలవబోతున్నట్లు డా. లక్ష్మణ్ వెల్లడించారు.మోదీ సూచన మేరకే మొదట బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్లు నితిన్, మిథాలీ రాజ్ కలసిన్నట్లు కూడా చెప్పారు. మోదీ పాలనపై వీరిరువురు ముగ్ధులమయ్యామని పేర్కొన్నారు.
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్
రోహిత్ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ
ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ఎస్ఐబీ చీఫ్ కోసం పిటిషన్