జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక నిందితులను కాపాడటం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అసలైన నిందితులకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు బయటపెట్టి, రాజకీయ పలుకుబడి గలవారి పిల్లలను కేసులో పోలీసులు చూపక తప్పని పరిస్థితులు కల్పించిన బిజెపి ఎంఎల్ ఎన్ రఘునందన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేసి, ఆయనకు నోటీసులు జారీ చేయడం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేరస్థులను వదిలివేస్తూ, న్యాయం కోసం పోరాడే వారిపై కేసులు పెడతారా అంటూ మండిపడుతున్నారు. తెరాస, ఏంఐఎం పార్టీకు బీ టీమ్ గా కాంగ్రెస్ పార్టీ వ్యవహారిస్తున్నట్లు ధ్వజమెత్తా
పోలీసులపై మహిళ కమిషన్ సీరియస్
హైదరాబాద్లోని అమ్నేషియా పబ్ నుంచి మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసు విచారణకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసుశాఖకు నోటీసులు జారీచేసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది.
ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే వీడియోలను ఆన్లైన్ నుంచి తొలగించాలని కోరారు. అట్లాంటి వీడియోలను పోస్టుల చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్ డీజీపీని కోరింది.
మరోవైపు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ నుంచి పోలీసు శాఖకు నోటీసులు అందాయి. ఇప్పటికే ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లకు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
కాగా, జూబ్లీహిల్స్లో బాలిక సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ సరిగా స్పందించడం లేదని, బాధిత బాలికకు పూర్తిన్యాయం జరిగేదాకా, నిందితులను అరెస్ట్ చేసి, దోషులకు శిక్షపడేదాకా ఆందోళనలు, ధర్నాలు, ఇతర రూపాల్లో ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అలాగే బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో దీనిపై బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది.
More Stories
బాల్యం నుండి స్వయంసేవక్ నే… తిరిగి ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా!
ఇదో దశలో 60 శాతం దాటిన పోలింగ్
అల్లర్ల నిందితుల అరెస్ట్కు ప్రత్యేక బృందాలు