ఈ సామగ్రిపై పన్ను మినహాయించే అంశంపై అధ్యయనానికి మేఘాలయ సీఎం కన్రడ్ సంగ్మా నేతృత్వంలో జీవోఎం ఏర్పాటైంది. ఈ జీవోఎంలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్ రావు కూడా సభ్యులు.
కన్రడ్ సంగ్మా సారధ్యంలోని జీవోఎం ఈ నెల ఏడో తేదీన నివేదిక సమర్పించిందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. కమిటీ సభ్యుడు, యూపీ ఆర్థికమంత్రి సురేశ్ కుమార్ ఖన్నా మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ రోగులకు ఉపశమనం కలిగించడానికి తమ రాష్ట్రం అనుకూలమేని పేర్కొన్నారు.
కరోనా రోగులకు ఉపశమనం కల్గించేలా కరోనా చికిత్స సామాగ్రిపై పన్నులు తగ్గించే అంశంపై తమ రాష్ట్రం అనుకూలంగానే ఉన్నదని సురేశ్ కుమార్ ఖన్నా చెప్పారు. అయితే, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లను అంగీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్లపై ఐదు శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కరోనా ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.
More Stories
స్వాతి మలివాల్పై దాడి గురించి కేజ్రీవాల్ దాటవేత
‘అధిక సంతానం’ ముస్లింల గురించి కాదు.. పేదల గురించి
2029 వరకు ప్రధానిగా నరేంద్ర మోదీ