కనీసం ఆ ఎమ్మెల్యేలపై పార్టీ పరంగానైనా చర్యలు తీసుకోగలరా? అని విజయశాంతి నిలదీశారు. ఓవైపు అవినీతి, అనైతిక వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతుంటే మరోవైపు, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఉద్యోగాలు రాని యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా కట్టడి విషయంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజుకు 7,600 ఆర్టీపీసీఆర్ టెస్టులు చెయ్యాలని కేంద్రం చెబితే నాలుగైదు వేలు కూడా దాటడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో టెస్టులు చేసే మిషన్లు లేక ప్రైవేటుకు పంపిస్తున్నారని విజయశాంతి ఆరోపించారు.
కరోనా కట్టడికి మద్యం దుకాణాలు, బార్లు, పబ్లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు తక్కువగా చేస్తున్నారని హైకోర్టు మందలించినా ఈ రాతి గుండె సర్కారు మారడం లేదన్నారు. ఈ పాలకుల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం అత్యాశే అవుతుందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.
More Stories
తెలంగాణ మంత్రివర్గ సమావేశంకు ఈసీ అనుమతి
యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి
వడ్ల కొనుగోలు వేగవంతం చేయండి రేవంత్