తెలంగాణలోని చారిత్రాత్మక రైల్వే జంక్షన్ కాజీపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే తయారీ యూనిట్ (పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ అత్యాధునిక కర్మాగారంలో సరికొత్త ‘ఇంటర్ సిటీ’ రైళ్ల ఉత్పత్తి ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విినీ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు.
కాజీపేటలో తయారయ్యే ఈ సరికొత్త ఇంటర్ సిటీ రైళ్లు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని రైల్వే మంత్రి వివరించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ ఇంటర్ సిటీ రైళ్లు మెట్రో తరహాలో ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్తోపాటు మెరుగైన వెంటిలేషన్తో తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటర్సిటీ రైలులో సురక్షితమైన డిజైన్తో కూడిన 20 కోచ్లు ఉంటాయని, వాటిలో సురక్షితమైన కోచ్ డిజైన్, అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
ఈ ఇంటర్సిటీ రైళ్లను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా తయారు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రయాణం కుదుపులు లేకుండా ఉండేందుకు ‘జెర్క్-ఫ్రీ కప్లర్స్’ను అమరుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఆదా ధ్యేయంగా ఈ రైళ్లలో అత్యంత ప్రతిష్టాత్మకమైన “రీజనరేటివ్ బ్రేకింగ్” సాంకేతికతను వాడుతున్నారు. ఈ విధానం ద్వారా రైలుకు బ్రేకులు వేసిన ప్రతిసారీ అది ఒక విద్యుత్ జనరేటర్లా మారుతుంది.

More Stories
ఫిన్లాండ్లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం
కంటోన్మెంట్లో 21 రోడ్లకు బ్రిటీషర్ల స్థానంలో భారితీయ వీరుల పేర్లు
కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి అబద్దాలు!