
ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు పంజాబ్ నుండి మాదకద్రవ్యాల ముప్పును నిర్మూలించడానికి చేపట్టిన “యుధ్ నాషియన్ విరుధ్” అనే మాదకద్రవ్యాలపై యుద్ధం 105 రోజులు పూర్తి కావడంతో, పంజాబ్ పోలీసులు 158 మంది మాదకద్రవ్యాల స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 1.9 కిలోల హెరాయిన్, 1 కిలోల ఓపియం, 2.8 కిలోల గంజాయి, రూ.36340 మాదకద్రవ్యాల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
దీనితో, కేవలం 105 రోజుల్లో అరెస్టయిన మొత్తం మాదకద్రవ్యాల స్మగ్లర్ల సంఖ్య 17,484 కు చేరుకుంది. రాష్ట్రంలోని 28 పోలీసు జిల్లాల్లో ఒకేసారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) పంజాబ్ గౌరవ్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ జరిగింది. ముఖ్యంగా, పంజాబ్ను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి పోలీసు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు మరి,యు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ను కోరారు.
మాదకద్రవ్యాలపై యుద్ధాన్ని పర్యవేక్షించడానికి పంజాబ్ ప్రభుత్వం ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా నేతృత్వంలో 5 మంది సభ్యుల క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 112 మంది గెజిటెడ్ అధికారుల పర్యవేక్షణలో 1700 మందికి పైగా పోలీసు సిబ్బందితో కూడిన 250కి పైగా పోలీసు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా 531 ప్రదేశాలలో దాడులు నిర్వహించాయని, దీని ఫలితంగా 116 ఎఫ్ఐఆర్ లను నమోదు చేసిన్నట్లు స్పెషల్ డిజిపి అర్పిత్ శుక్ల తెలిపారు.
రోజంతా జరిగిన ఆపరేషన్లో పోలీసు బృందాలు 582 మంది అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశాయని ఆయన తెలిపారు. రాష్ట్రం నుండి మాదకద్రవ్యాలను నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు-కోణాల వ్యూహాన్ని – ఎన్ఫోర్స్మెంట్, డెడ్డిక్షన్, ప్రివెన్షన్ – అమలు చేయడంతో, పంజాబ్ పోలీసులు ‘డి-డిక్షన్’లో భాగంగా ఈరోజు 65 మందిని డి-డిక్షన్, పునరావాస చికిత్స చేయించుకునేలా ఒప్పించారని స్పెషల్ డిజిపి తెలిపారు.
More Stories
ఎల్ఐసీలో 1 శాతం వాటా విక్రయం
ఆగస్టు నుంచి అన్ని పోస్టాఫీసుల్లో డిజిటల్ చెల్లింపులు
29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు