
అమెరికాకు చెందిన కొందరు తనను కలిశారని, వాళ్ల రోడ్ల వ్యవస్థ కన్నా మనది బెటర్గా ఉన్నట్లు చెప్పారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వేసిన నాణ్యమైన రోడ్ల వల్ల లాజిస్టిక్ ఖర్చులు భారత్ లో తగ్గినట్లు మంత్రి తెలిపారు. దీని వల్ల ఎగుమతిలో పోటీతత్వం పెరుగుతుందని, ఒకవేళ మనం మన ఎగుమతుల్ని పెంచితే, అది మన వ్యవసాయ, ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేస్తుందని వివరించారు.
భారత్ లో లాజిస్టిక్స్ ఖర్చులు ఎక్కువ అని, అది 16 శాతంగా ఉందని, చైనాలో కేవలం 8 శాతం మాత్రమే ఉందని గడ్కరీ చెప్పారు. ఇక అమెరికా, యూరోప్ దేశాల్లో లాజిస్టిక్స్ ఖర్చులు 12 శాతం ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో మన రోడ్లు సరిగా లేవని, మన పోర్టులు సరిగా లేవని, ట్రాఫిక్ వల్ల ఖర్చులు పెరిగేవని పేర్కొన్నారు. రోడ్లను మెరుగుపరచడం వల్ల లాజిస్టిక్ ఖర్చులను 9 శాతం తగ్గించినట్లు ఆయన చెప్పారు.
25 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలు, 3 వేల కిలోమీటర్ల పోర్టు కనెక్టివిటీ హైవే, దైవక్షేత్రాలను కలుపుతూ రూ. లక్ష కోట్ల విలువైన రోడ్డు పనులను చేపట్టినట్లు మంత్రి గడ్కరీ తెలిపారు. వివిధ వాతావరణాలను తట్టుకునే రీతిలో బౌద్ధ, ఛార్ధామ్ క్షేత్రాలను కలిపే రోడ్లను నిర్మించినట్లు చెప్పారు. జమ్మూ, శ్రీనగర్ మధ్య 36 టన్నెల్స్ను డెవలప్ చేశామని, 23 టన్నెల్స్ పూర్తి అయ్యాయని, మరో నాలుగైదు నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. పర్వతమాలా యోజన కింద 15 రోప్వేలను డెవలప్ చేస్తున్నామని, దీంతో పాటు 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
More Stories
ఇరాన్ గగనతలాన్ని తెరవడంతో 290 మంది రాక
అస్సాంలో 5000 విదేశీ ఫేస్బుక్ ఖాతాలు యాక్టివ్
కాంగ్రెస్, ఆర్జేడీలకు కుటుంబ రాజకీయాలే ముఖ్యం