
అమెరికా నుంచి ఇలా వచ్చి, అలా పరీక్షలు రాసిన అభ్యర్థి ఏకంగా టాపర్ అయిపోయాడు. కోచింగ్ తీసుకోలేదు. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ కూడా చేయలేదట. కానీ గ్రూప్-1 మెయిన్స్లో 502 మార్కులొచ్చాయి. ఇతను కాంగ్రెస్ నేత దగ్గరి బంధువట. కాంగ్రెస్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ కోడలు టాపర్గా నిలిచారు. సదరు అభ్యర్థి రోజుకు ఐదు గంటలే చదివారట. మిగతా వాళ్లేమో 16 గంటలకు చదివినా టాపర్లు కాలేదు.
ఈ అభ్యర్థులే కాకుండా మరికొందరు కాంగ్రెస్ నేతల కుటుంబసభ్యులున్నట్టు నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రెండోసారి నిర్వహించినప్పుడు ఓఎమ్మార్ షీట్లు అధికంగా రావడం, బయోమెట్రిక్ హాజరు అమలు చేయలేదన్న కారణంతో అభ్యర్థులు కోర్టుకెళ్లారు. కోర్టు పరీక్షను రద్దుచేసి, మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చింది.
తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం మారగానే టీజీపీఎస్సీ వైఖరి కూడా మారింది. హైకోర్టు పరీక్షను రద్దుచేసి, మళ్లీ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించమంటే కాంగ్రెస్ సర్కారు ఏకంగా నోటిఫికేషన్నే రద్దుచేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కూడా ఉపసంహరించుకున్నది.
ఇలా టీజీపీఎస్సీ వైఖరిని ఉన్నఫళంగా మార్చుకోవడం వెనుక బిగ్ స్కెచ్ దాగి ఉన్నట్టు నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. కొత్త నోటిఫికేషన్లో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరు పెద్దలకు కావాల్సినవారు దరఖాస్తు చేసినవాళ్లున్నారట. అలాంటి వారిని ఒకే కేంద్రంలో పరీక్ష రాయించి, టాపర్లుగా నిలిపారు. ఇప్పుడు ఉద్యోగాలివ్వబోతున్నారని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను