
కేంద్ర కాలుష్య నివారణ బోర్డు ఫిబ్రవరి 3వ తేదీన ఇచ్చిన నివేదికలో ప్రయాగ్రాజ్లోని నీటి నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేసింది. నీటిలో మల శాతం ఎక్కువగా ఉందని, దీని వల్ల మహాకుంభ్ నీరు స్నానానికి అనువైనట్లుగా లేదని జాతీయ గ్రీన్ ట్రబ్యునల్కు సీపీసీబీ చెప్పింది. అయితే ప్రయాగ్రాజ్ నీటి నాణ్యతపై మళ్లీ ఫిబ్రవరి 28వ తేదీన కొత్త రిపోర్టును సమర్పించారు.
ఆ రిపోర్టు ప్రకారం త్రివేణి సంగమ నీరు స్నానానికి అనువుగా ఉన్నట్లు సీపీసీబీ పేర్కొన్నది. వేర్వేరు తేదీల్లో, వేర్వేరు ప్రాంతాల నుంచి సేకరించిన శ్యాంపిళ్ల ఆధారంగా డేటాను విశ్లేషించినట్లు తెలిపారు. ప్రయాగ్రాజ్లోని శృంగవర్పుర్ ఘాట్ నుంచి దీనాఘాట్ వరకు వారానికి రెండు సార్లు శ్యాంపిళ్లను సేకరించారు. త్రివేణి సంగమ ప్రాంతం నుంచి కూడా నీటిని టెస్టింగ్ కోసం సేకరించారు.
జనవరి 12వ తేదీ నుంచి మ్యానిటరింగ్ ప్రారంభమైంది. అమృత స్నానాలు జరిగిన రోజుల్లో నీటిని పరీక్షించారు. ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన 10 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల డేటాను కూడా మానిటర్ చేశారు. సేకరించిన నమూనాలు నది విస్తీర్ణం అంతటా మొత్తం నది నీటి నాణ్యతను పూర్తిగా ప్రతిబింబించలేవని పేర్కొంది.
మహాకుంభ్లో వేస్ట్వాటర్ను ట్రీట్ చేసేందుకు ఉత్తరప్రదేశ్ సర్కారు పది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇక 21 డ్రైనేజీల ప్రదేశాల వద్ద వాటర్ ట్రీట్మెంట్ చేసింది. దీని కోసం ఏడు జియో ట్యూబ్లను అమర్చింది. నీటి శుభ్రత కోసం అడ్వాన్స్ స్థాయి ఆక్సిడేషన్ టెక్నిక్లను వాడినట్లు అధికారులు చెప్పారు.
More Stories
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం
మణిపూర్లో తెగల మధ్య ఘర్షణలో ఒకరు మృతి