మరో ముగ్గురు హమాస్ బందీల విడుదల

మరో ముగ్గురు హమాస్ బందీల విడుదల
గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌కు చెందిన మరో ముగ్గురు బందీలను హమాస్‌ శనివారం విడుదల చేసింది. ఆ ముగ్గురిని రెడ్‌ క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్ డెకెల్‌ చెన్‌ (36), అలెగ్జాండర్‌ ట్రుఫనోవ్‌ (29), యైర్‌ హార్న్‌ (46)లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. 
 
కాల్పుల విరమణను ఇజ్రాయెల్‌ ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ఇటీవల హమాస్‌ ప్రకటించిన విషయం విదితమే. అయితే దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సహా ఇజ్రాయెల్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ వారాంతంలో తమ బందీలను విడుదల చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది.
 
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 498 రోజుల నిర్బంధం తర్వాత ఈ బందీలను రెడ్‌క్రాస్‌కు అప్పగించారు.  ఇయర్ హార్న్, 46, ఇజ్రాయెల్-అర్జెంటీనా ద్వంద్వ పౌరసత్వం; అమెరికన్-ఇజ్రాయెల్ సాగుయ్ డెకెల్ చెన్, 36;  రష్యన్-ఇజ్రాయెల్ అలెగ్జాండర్ (సాషా) ట్రౌఫానోవ్, 29 లకు ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించారు. వారిని వైద్య చికిత్స కోసం, వారి బంధువులతో తిరిగి కలపడానికి తీసుకువెళుతున్నట్లు వారు తెలిపారు.
 
అక్టోబర్ 7, 2023న జరిగిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని రేకెత్తించిన దాడిలో అపహరించబడిన బందీలు పాలిపోయి, అరిగిపోయినట్లు కనిపించారు. అయితే, గత శనివారం విడుదలైన ముగ్గురు వ్యక్తుల కంటే వారు మెరుగైన శారీరక స్థితిలో ఉన్నట్లు కనిపించారు, వారు 16 నెలల బందిఖానా నుండి కృశించి బయటకు వచ్చారు.
 
ముగ్గురు బందీలను హమాస్‌ విడుదల చేయగా, దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ 369 మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది. ఖతర్‌, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో గత నెల ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా హమాస్‌ తమ చెరలోని 94 మంది బందీల్లో 33 మంది బందీలను విడుదల చేయనుంది. 
 
ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనీయులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్‌ విముక్తి కల్పించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకు పలు దఫాలుగా 21 మంది బందీలను హమాస్‌ విడుదల చేయగా, 730 మంది పాలస్తీనా ఖైదీలకు టెల్‌అవీవ్‌ విముక్తి కల్పించింది.