రూ. 50,65,345 కోట్లతో కేంద్ర బ‌డ్జెట్‌

రూ. 50,65,345 కోట్లతో కేంద్ర బ‌డ్జెట్‌
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ మొత్తంగా రూ. 50,65,345 కోట్ల కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మొత్తం రెవెన్యూ వ‌సూళ్ల‌ను రూ. 34,20,409 కోట్లుగా అంచ‌నా వేశారు. మూల‌ధ‌న వ‌సూళ్ల‌లో రూ. 16,44,936 కోట్లుగా ఉండ‌బోతున్న‌ట్లు తెలిపారు.  2025-26 బ‌డ్జెట్‌లో అత్య‌ధికంగా ర‌క్ష‌ణ రంగానికి నిధులు కేటాయించారు. ఆ త‌ర్వాత గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించారు. శాస్త్ర, సాంకేతిక రంగానికి రూ. 55 వేల కోట్లు కేటాయించిన‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు.
 
కేంద్ర బడ్జెట్‌ లో మొత్తం 36 రకాల ఔషధాలపై 100 శాతం పన్ను మినహాయింపునిచ్చారు. దాంతో రోగులపై ఆర్థిక భారం తగ్గనుంది. అత్యవసరమైన చికిత్సలకు ఖర్చును తగ్గించే లక్ష్యంతో 36 రకాల ఔషధాలపై 100 శాతం కస్టమ్‌ డ్యూటీ మినహాయింపును ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన 2025-26 బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.  ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు ఈ కస్టమ్‌ డ్యూటీ మినహాయింపుతో అధిక ప్రయోజనం కలుగనుంది. 2024 ఫిబ్రవరిలో కూడా ప్రభుత్వం మూడు రకాల క్యాన్సర్‌ ఔషధాలపై జీఎస్టీని రద్దు చేసింది. జీఎస్టీ రద్దయిన ఔషధాల్లో Trastuzumab Deruxtecan, Osimertinib, Durvalumab ఉన్నాయి. 

36 రకాల ఔషధాలపై కస్టమ్‌ 100 శాతం కస్టమ్‌ డ్యూటీ మినహాయింపుతోపాటు మరో ఆరు రకాల వ్యాధులకు సంబంధించిన ఔషధాలపై రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వాటిలో క్యాన్సర్‌ వ్యాధి చికిత్సకు వినియోగించే ఔషధాలు, అరుదైన వ్యాధులకు అవసరమయ్యే ఔషధాలు, తీవ్ర అనారోగ్యాలకు సంబంధించిన ఔషధాలు ఉన్నాయని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

బ‌డ్జెట్ 2025 స‌మ‌గ్ర స్వ‌రూపం

రెవెన్యూ వ‌సూళ్లు రూ. 34,20,409 కోట్లు
ప‌న్ను వసూళ్లు రూ. 28,37,409 కోట్లు
ప‌న్నేత‌ర వ‌సూళ్లు రూ. 5,83,000 కోట్లు
మూల‌ధ‌నం వ‌సూళ్లు రూ. 16,44,936 కోట్లు
రుణాల రిక‌వ‌రీ రూ. 29 వేల కోట్లు
ఇత‌ర వ‌సూళ్లు రూ. 47 వేల కోట్లు
అప్పులు, ఇత‌ర వ‌సూళ్లు రూ. 15,68,936 కోట్లు
మొత్తం ఆదాయం రూ. 50,65,345 కోట్లు
మొత్తం వ్య‌యం రూ. 50,65,345 కోట్లు

రెవెన్యూ ఖాతా రూ. 39,44,255 కోట్లు
వ‌డ్డీ చెల్లింపులు రూ. 12,76,338 కోట్లు
మూల‌ధ‌న ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ. 4,27,192 కోట్లు
మూలధ‌న ఖాతా రూ. 11,21,090 కోట్లు
వాస్త‌వ మూలధ‌న వ్య‌యం రూ. 15,48,282 కోట్లు
రెవెన్యూ లోటు రూ. 5,23,846 కోట్లు
నిక‌ర రెవెన్యూ లోటు రూ. 96,654 కోట్లు
ద్ర‌వ్య లోటు రూ. 15,68,936 కోట్లు
ప్రాథ‌మిక లోటు రూ. 2,92,598 కోట్లు

బ‌డ్జెట్ కేటాయింపులు

ర‌క్ష‌ణ రంగం – రూ. 4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ధి – రూ. 2,66,817 కోట్లు
హోం శాఖ – రూ. 2,33,211 కోట్లు
వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాలు – రూ. 1,71,437 కోట్లు
విద్యారంగం – రూ. 1,28,650 కోట్లు
ఆరోగ్య రంగం – రూ. 98,311 కోట్లు
ప‌ట్టణాభివృద్ధి రూ. 96,777 కోట్లు
ఐటీ, టెలికాం – రూ. 95,298 కోట్లు
ఇంధ‌న రంగం – రూ. 81,174 కోట్లు
వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు – రూ. 65,553 కోట్లు
సామాజిక‌, సంక్షేమ రంగం – రూ. 60,052 కోట్లు
శాస్త్ర‌, సాంకేతిక రంగం – రూ. 55,679 కోట్లు

ప్రభుత్వ పథకాలకు భారీ కేటాయింపులు

కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 150 పథకాలకు బడ్జెట్‌లో కీలక కేటాయింపులు చేసింది. ఆ కేటాయింపుల వివరాలు:

  • గ్రామీణ ఉపాధి హామీకి రూ. 86 వేల కోట్లు.
  • ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజనకు రూ.19 వేల కోట్లు.
  • జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌కు రూ.19 వేల కోట్లు
  • వాటర్‌ షెడ్‌ అభివృద్ధికి రూ. 2,505 కోట్లు
  • కృషి వికాస యోజనకు రూ. 8,500 కోట్లు
  • ఆయుష్‌ మిషన్‌కు రూ.1,275 కోట్లు
  • సమగ్ర శిక్షా యోజనకు రూ. 41,250 కోట్లు
  • పోషణ్ శక్తికి రూ.12,500 కోట్లు
  • ప్రధాన మంత్రి స్కూల్‌ రైజింగ్‌కి రూ. 7,500 కోట్లు
  • ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.30 వేల కోట్లు
  • ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయలకు రూ. 7 వేల కోట్లు
  • ఆయుష్మాన్‌ భారత్‌కి రూ.9,600 కోట్లు 
  • పోలీస్ ఆధునీకరణకు రూ.4,069 కోట్లు
  • ప్రధాని ఆవాస యోజన (అర్బన్‌) రూ.19,794 కోట్లు
  • ప్రధాని ఆవాస యోజన (గ్రామీణ) రూ.54,832 కోట్లు
  • అమృత్‌కి రూ.10 వేల కోట్లు
  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్బన్‌) రూ. 5 వేల కోట్లు
  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) రూ.7,192 కోట్లు
  • అర్బన్‌ ఛాలంజ్‌ ఫండ్‌ రూ.10 వేల కోట్లు
  • పీఎం కృషీ సించాయి యోజన రూ. 8,260 కోట్లు
  • నదుల అనుసంధానానికి రూ. 2,400 కోట్లు
  • పోలవరం ప్రాజక్టుకు రూ. 5,936 కోట్లు
  • జలజీవన్‌ మిషన్‌ (గ్రామీణ తాగునీటి) రూ. 67 వేల కోట్లు
  • పన్ను మినహాయింపుల కోసం రూ. 22,600 కోట్లు
  • అంగన్‌వాడీ రూ. 21,960
  • పంటల భీమా రూ.12,242 కోట్లు
  • పీఎం ఆశా రూ. 6,941 కోట్లు
  • పీఎం కిసాన్‌ రూ. 63,500 కోట్లు
  • పత్తి టెక్నాలజీ మిషన్‌ రూ.500 కోట్లు
  • పప్పు ధాన్యాల మిషన్‌ రూ. వెయ్యి కోట్లు
  • పండ్లు, కూరగాయల మిషన్‌ రూ. 500 కోట్లు
  • హైబ్రిడ్‌ విత్తనాల మిషన్‌ రూ. 100 కోట్లు
  • మఖనా బోర్డుకు రూ.100 కోట్లు
  • యూరియా సబ్సిడీ రూ.1,18,900 కోట్లు
  • పోషకాహార సబ్సిడీ రూ. 49 వేల కోట్లు
  • కొత్త పారిశ్రామిక పార్క్‌లకు రూ. 2,500 కోట్లు
  • టెలికం మౌలిక సదుపాయలకు రూ. 28,400 కోట్లు
  • గరీబ్‌ కళ్యాణ్‌ యోజన రూ. 2 లక్షల 3 వేల కోట్లు
  • రక్షణ పరిశోధనలకు రూ.14,924 కోట్లు
  • విమానాలు, ఏరో ఇంజన్లకు రూ. 48,614 కోట్లు
  • రక్షణ నిర్మాణాలకు రూ. 11,452 కోట్లు
  • నావెల్‌ ఫ్లీట్‌ రూ. 24,391
  • సెమీ కండక్టర్స్‌ వ్యవస్థ ఏర్పాటు రూ. 7 వేల కోట్లు
  • ఇండియా ఎఐ మిషన్‌ రూ. 2 వేల కోట్లు
  • మెట్రో ప్రాజక్టులు రూ.31,239 కోట్లు
  • పోలీసు మౌలిక వసతులకు రూ. 4,379
  • కొత్త ఉద్యోగాల సృష్టికి రూ. 20 వేల కోట్లు
  • కుసుం రూ. 2,600 కోట్లు
  • సూర్య ఘర్‌ రూ. 20 వేల కోట్లు
  • పేదలకు ఎల్‌పిజి కనెక్షన్లకు రూ. 9,100 కోట్లు
  • కొత్త రైల్వే లైన్లకు రూ. 32,235 కోట్లు
  • డబ్లింగ్‌కి రూ. 32 వేల కోట్లు
  • రోలింగ్‌ స్టాక్‌ రూ. 45,530 కోట్లు
  • జాతీయ రహదారులకు రూ. 1, 70, 266 కోట్లు
  • మంత్రిత్వ శాఖ ద్వారా రహదారులకు రూ.1,16,292 కోట్లు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పరిశోధనలకు రూ.20 వేల కోట్లు
  • ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌ రూ. 7,089
  • ఖేలో ఇండియా రూ. 1000 కోట్లు

భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు